AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పండుగ రోజు ఈ పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి..!

రక్షాబంధన్‌ ను ఆధ్యాత్మికంగా సెలబ్రేట్ చేసుకుంటే అన్నదమ్ముల అనుబంధం బలపడటమే కాదు.. ఇంట్లో సిరిసంపదలు, శాంతి కూడా పెరుగుతాయని నమ్ముతారు. ఈ స్పెషల్ డే నాడు శివుడు, లక్ష్మీదేవి, వినాయకుడికి పూజ చేయడం చాలా శుభదాయకం. కొన్ని స్పెషల్ పూజలు చేయడం వల్ల లైఫ్‌ లో మంచి మార్పులు వస్తాయని అంటారు.

రాఖీ పండుగ రోజు ఈ పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి..!
Rakhi Festival
Prashanthi V
|

Updated on: Aug 07, 2025 | 8:02 PM

Share

రక్షాబంధన్ పండుగ సోదర, సోదరీమణుల అనుబంధానికి చిహ్నం. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటుంది. ఈ పండుగ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, పనులు చేయడం వల్ల వారి జీవితంలో శుభం జరుగుతుందని నమ్మకం ఉంది. రక్షాబంధన్ రోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంపద కోసం రాఖీ పూజ

రక్షాబంధన్ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజ గదిలో అన్ని రాఖీలను ఒక పళ్లెంలో పెట్టండి. ఆ పళ్లెంలో ఒక వెండి నాణెం లేదా రూపాయి నాణెం ఉంచండి. తర్వాత ఆ రాఖీలను వినాయకుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయ్యాక ఆ నాణేన్ని ఎర్రని బట్టలో చుట్టి మీ డబ్బు పెట్టే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద పెరుగుతుందని చెబుతారు.

అభివృద్ధి కోసం శివ పూజ

జీవితంలో ఎదుగుదల సాధించాలనుకునేవారు రక్షాబంధన్ రోజున శివుడికి అభిషేకం చేయాలి. పంచామృతంతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) శివలింగానికి అభిషేకం చేసి శివుడికి రాఖీ కట్టండి. పూజ చేసేటప్పుడు మనసులో శివ నామాలను జపించండి. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయి.

లక్ష్మీ, వినాయక పూజ

రక్షాబంధన్ రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం కలుగుతాయి. పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి మంత్రం ( ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః )ను 108 సార్లు, వినాయకుడి మంత్రం ( ఓం గణ గణపతయే నమః ) ను 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సమస్యలు తొలగి సంపద పెరుగుతుంది.

కుటుంబ రక్షణ కోసం

కుటుంబానికి రక్షణ ఉండాలని కోరుకునే వారు ఒక శుభ్రమైన పట్టు బట్టలో పసుపు, కుంకుమ, గంధం, బియ్యం, దుర్వ, ఒక రూపాయి నాణెం లేదా చిన్న బంగారు ముక్కను ఉంచి ఎర్రటి లేదా పసుపు రంగు దారంతో కట్టండి. ఈ మూటను మీ ఇంటి పూజ గదిలో లేదా పవిత్రమైన చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల కుటుంబం శాంతిగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంటుందని నమ్ముతారు.

Follow Us
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం