Mahabharata Moral Story: మనం తినే ఆహారంలో ఐదు దోషాలున్నాయి.. వాటిని గుర్తించి తినకపోతే కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసా..!

Moral Story In Mahabharata: మహాభారతంలో ప్రతి పాత్ర, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆలోచనా విధానం నేటి మానవుడికి మంచి చెడుల తేడాలను తెలియజేసే మార్గదర్శకాలు. మనం తినే తిండి పీల్చేగాలి.. జీవించే విధానం మన ఆలోచనలపై..

Mahabharata Moral Story: మనం తినే ఆహారంలో ఐదు దోషాలున్నాయి.. వాటిని గుర్తించి తినకపోతే కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసా..!
Love Food
Follow us

|

Updated on: Aug 15, 2021 | 6:29 AM

Moral Story In Mahabharata: మహాభారతంలో ప్రతి పాత్ర, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆలోచనా విధానం నేటి మానవుడికి మంచి చెడుల తేడాలను తెలియజేసే మార్గదర్శకాలు. మనం తినే తిండి పీల్చేగాలి.. జీవించే విధానం మన ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. ఇదే విషయాన్నీ కృష్ణుడు విదురుడి తెలిపారు. మనం తినే ఆహారం ఎక్కడ వండితే.. ఎలాంటి ఆలోచనలు వస్తాయో .. ఎటువంటి దోషాలు నిండి ఉన్నాయో తెలిపాడు కృష్ణుడు. అంతేకాదు మనం ఎవరికైనా ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలని తెలిపాడు. మనం తీసుకునే ఆహారంలో ఐదు విదాలైన దోషాలు యిమిడివున్నాయి. అవి ఏమిటో .. వాటి వలన కలిగే దోషాలను గుర్తించి ఆహారం స్వీకరించకపోతే కలిగే అనర్ధాలను గురించి పెద్దలు చెప్పారు . అవి ఏమిటో చూద్దాం..

* అర్ధ దోషం:

సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషమని అంటారు. ఇలాంటివారి ఇంట భోజనం చేస్తే కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిపే కథ.. ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోష భూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు.” అని తలవంచుకొన్నాడు. అందుకనే మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.

* నిమిత్త దోషం:

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి ఇందుకు ఉదాహరణ భీష్ముడు అంపశయ్య మీద చెప్పిన కథ .. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయారు? అని ఆలోచిస్తుంది. ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు.. ‘అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. నా స్వీయ బుధ్ధిపై ఆ ఆహారం ప్రభావం చూపించింది. ఇప్పుడు శరాఘాతాలతో.. ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం.. బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చింది తింటే మనిషిలోని మంచి గుణములు నశించి “నిమిత్త దోషం” ఏర్పడుతోంది.

* స్ధాన దోషం:

ఏ స్ధలంలో ఆహారం వండబడుతుందో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు. దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.

* గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

*సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.

Also Read: కుడికంటితో భక్తులను చూస్తూ కోరినకోర్కెలు నెరవేర్చే నేట్టికంటి ఆంజనేయస్వామి