
సనాతన ధర్మంలో లక్ష్మీదేవి ఆరాధన చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడింది. నిర్మలమైన భక్తితో లక్ష్మీదేవిని పూజించే భక్తులకు ఆమె ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ సంపద, శ్రేయస్సుకు లోటు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఉదయం నిద్రలేచి నీటిలో పాలు కలిపి స్నానం చేయండి. తరువాత పూజ గదిలో లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఆమెకు పాయసం సమర్పించి, తామర పువ్వును సమర్పించండి. తరువాత ‘శ్రీ కనకధార స్తోత్రం’ పఠించండి. హారతిని ఇచ్చి పూజను కూడా పూర్తి చేయండి. ఇలా చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి.
శుక్రవారాల్లో కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు. తన భక్తులకు ఆనందం, శ్రేయస్సును ఇస్తుంది. జీవితం సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో తెలుసుకుందాం..
తెల్లటి వస్తువులను దానం చేయడం
శుక్రవారాల్లో పిండి, పాలు, చక్కెర, బియ్యం వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టవచ్చు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున చీమలకు పిండి , చక్కెరను నైవేద్యం పెట్టండి. దీనితో పాటు, ఆవుకు పిండిని ఆహారంగా అందిచడం వలన లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది.
ఆవు పూజ
పురాణ గ్రంథాలలో ఆవును లక్ష్మీ స్వరూపంగా వర్ణించారు సకల దేవతలు ఆవులో నివసిస్తారని నమ్ముతారు. శుక్రవారం ఆవును పూజించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ఆవుకి సేవ చేసే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. శుక్రవారం గోమాతకి బెల్లం తినిపించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం పాలకూర తినిపించడం ద్వారా సంపద, శ్రేయస్సును కూడా పొందవచ్చు.
ఎరుపు రంగు దుస్తులు ధరించండి:
ఎరుపు రంగు లక్ష్మిదేవి కి చాలా ప్రియమైనది. కనుక శుక్రవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఇది శ్రేయస్సు , అదృష్టానికి సంకేతం. మీ ఇంట్లో డబ్బు కొరత ఉంటే.. శుక్రవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రోజున సుమంగళికి సంబంధిత వస్తువులను దానం చేయడం కూడా ఫలవంతంగా ఉంటుంది.
బాలికలకు పాయసం ప్రసాదంగా
శుక్రవారం రోజున 3, 5 లేదా 7 మంది బాలికలకు పాయసాన్ని ప్రసాదంగా పంచి పెట్టడం వలన లక్ష్మి దీవెనలు లభిస్తాయి. పాయసాన్ని ప్రసాదంగా అందించిన తర్వాత.. బాలికలకు దక్షిణ, బహుమతులు ఇచ్చి వారిని పంపించండి.
తులసి పూజ:
శుక్రవారం నాడు తులసి మొక్కకు నీరు సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. హిందూ మతంలో తులసిని లక్ష్మి రూపంగా భావిస్తారు. తులసిని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.