AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamika Ekadashi: రేపే కామిక ఏకాదశి.. ఆర్థిక ఇబ్బందులా? వీటిని దానం చేసి చూడండి, డబ్బే డబ్బు !

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. అంతేకాదు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి. అందుకనే ఈ ఏకాదశి రోజున చేసే పూజలు శివ కేశవులు అందుకుంటారని నమ్మకం. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ కామిక ఏకాదశి రోజున కొన్ని దానాలు చేయడం వలన డబ్బులకు ఇబ్బందులు తీరతాయి.

Kamika Ekadashi: రేపే కామిక ఏకాదశి.. ఆర్థిక ఇబ్బందులా? వీటిని దానం చేసి చూడండి, డబ్బే డబ్బు !
Kamika Ekadashi
Surya Kala
|

Updated on: Jul 20, 2025 | 10:40 AM

Share

ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిథిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆషాడ కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూలై 20న మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు జూలై 21న ఉదయం 9:38 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో కామిక ఏకాదశి ఉపవాసం జూలై 21, 2025 సోమవారం నాడు పాటించబడుతుంది. కామిక ఏకాదశి అంటే కోరికలు తీర్చే ఏకాదశి అని అర్ధం. ఈ రోజున చేసే దానధర్మాల మహిమను గురించి పురాణ గ్రంథాల్లో వర్ణించారు.

దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. కామిక ఏకాదశి నాడు మీరు మూడు వస్తువులను దానం చేయగలిగితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి సంపదను పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున కామిక ఏకాదశి నాడు ఏమి దానం చేయాలో తెలుసుకుందాం..

ఆహార దానం హిందూ మతంలో ఆహారాన్ని దానం చేయడం ఉత్తమ దానంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో కామిక ఏకాదశి నాడు ఆహారాన్ని దానం చేయడం చాలా పుణ్యప్రదం కావచ్చు. కామిక ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు, పప్పులు, ఖీర్ మొదలైనవి దానం చేయడం వల్ల విష్ణువు అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. జీవితంలో శ్రేయస్సు వస్తుంది.

ఇవి కూడా చదవండి

నువ్వుల దానం కామిక ఏకాదశి రోజున నువ్వుల దానం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. కామిక ఏకాదశి రోజున నలుపు లేదా తెలుపు నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుందని.. మోక్షాన్ని పొందుతాయని విశ్వాసం. అంతేకాదు నువ్వులను దానం చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. సకల పాపాలను నాశనం చేస్తుంది. వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది.

పసుపు వస్త్రాలు దానం విష్ణువు పసుపు రంగు అంటే ఇష్టం. కనుక కామిక ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో జీవితంలోని అన్ని సమస్యల నుంచి విముక్తి చేస్తాడని.. ఆనందం, శాంతిని ప్రసాదిస్తాడని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.