
దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
ఉదయం 6:05 గంటలకు కాచిగూడ నుంచి రైలులో బయలుదేరుతారు. రాత్రి ప్రయాణం ఉంటుంది.
ఉదయం 9:15 గంటలకు మంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి ఉడుపికి వెళ్తారు. హోటల్లో చెక్-ఇన్ అనంతరం ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయం, మల్పే బీచ్ సందర్శిస్తారు. ఉడుపిలోనే రాత్రి బస.
ఉదయం కొల్లూరుకు వెళ్లి మూకాంబికా అమ్మవారి ఆలయం దర్శనం. అనంతరం మురుడేశ్వర్ ఆలయం, ప్రపంచ ప్రసిద్ధ భారీ శివుని విగ్రహం సందర్శన. సాయంత్రం గోకర్ణ మహాబలేశ్వర ఆలయం, బీచ్ సందర్శించి తిరిగి ఉడుపికి చేరుకుంటారు.
హోటల్ చెక్అవుట్ అనంతరం హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం దర్శనం. తర్వాత శృంగేరి శారదాంబ ఆలయం సందర్శించి సాయంత్రానికి మంగళూరుకు చేరుకుంటారు. మంగళూరులో రాత్రి బస.
మంగళూరు నగర దర్శనం. ఇందులో మంగళాదేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయం, కుద్రోలి గోకర్ణనాథ ఆలయం, తన్నీర్భావి బీచ్ సందర్శిస్తారు. సాయంత్రం మంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి రైలులో తిరుగు ప్రయాణం.
రాత్రి 11:40 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
4 నుంచి 6 మంది కలిసి బుక్ చేస్తే మరింత తక్కువ ధరలో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఏప్రిల్ నుంచి ప్యాకేజీ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. Comfort, Standard రెండు కేటగిరీల్లోనూ ఛార్జీలు కొద్దిగా పెరుగుతాయి.
దేవాలయ దర్శనాలతో పాటు కర్ణాటక తీరప్రాంతంలోని అందమైన బీచ్లు, ప్రకృతి సోయగాలు, ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే యాత్రలో కవర్ చేయాలనుకునే వారికి ఈ IRCTC Coastal Karnataka ప్యాకేజీ మంచి ఎంపికగా చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి సౌకర్యవంతమైన రైలు ప్రయాణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
కోస్టల్ కర్ణాటక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.