భక్తురాలి కొడుకుని బతికించిన క్షేత్రం.. ఈ జ్యోతిర్లింగం దర్శనంతో సంతానం లేని దంపతులకు సంతానం..

|

Jul 23, 2024 | 8:18 PM

ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని దౌల్తాబాద్‌లోని బెరల్‌గావ్‌లో ఉంది. ఈ ఆలయాన్ని ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ ఆలయం అని కూడా అంటారు. అజంతా, ఎల్లోరా గుహలకు సమీపంలో ఉన్న ఈ శివలింగం శివుని పట్ల భక్తులకు ఉన్న నిజమైన భక్తికి చిహ్నం. ఆ భక్తురాలి పేరు మీదుగా ఈ శివలింగానికి ఘుష్మేశ్వర అని పేరు వచ్చింది.

భక్తురాలి కొడుకుని బతికించిన క్షేత్రం.. ఈ జ్యోతిర్లింగం దర్శనంతో సంతానం లేని దంపతులకు సంతానం..
Grishneshwar Temple
Follow us on

శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన అద్భుత కథనాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. భగవంతుని భక్తికి నిజమైన ఉదాహరణగా పిలువబడే పరమశివుని ఈ చివరి జ్యోతిర్లింగానికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఇక్కడ పరమశివుడు తన భక్తుడి కోరికను తిరిగి బతికించాడు. దీని కారణంగా సంతానం లేని ఏ జంట అయినా సంతానం కోసం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే త్వరలో ఆ దంపతుల కోరికను నెరవేరుస్తాడని నమ్మకం.

జ్యోతిర్లింగ క్షేత్రం ఎక్కడ ఉందంటే..?

ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని దౌల్తాబాద్‌లోని బెరల్‌గావ్‌లో ఉంది. ఈ ఆలయాన్ని ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ ఆలయం అని కూడా అంటారు. అజంతా, ఎల్లోరా గుహలకు సమీపంలో ఉన్న ఈ శివలింగం శివుని పట్ల భక్తులకు ఉన్న నిజమైన భక్తికి చిహ్నం. ఆ భక్తురాలి పేరు మీదుగా ఈ శివలింగానికి ఘుష్మేశ్వర అని పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి

జ్యోతిర్లింగ క్షేత్రం గురించి పురాణ కథ ఏమిటంటే

ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం ప్రకారం దక్షిణ దేశంలోని దేవగిరి పర్వతం సమీపంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. ఈ దంపతులకు సంతానం లేదు. దీంతో ఇద్దరూ ఆందోళన చెందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య అయిన సుదేహ తన భర్తను తన చెల్లెలు ఘుష్మతో మళ్ళీ వివాహం చేసింది. ఘుష్మ గొప్ప శివ భక్తురాలు. పరమశివుని దయతో ఆమెకు ఆరోగ్యవంతమైన కొడుకు పుట్టాడు. అయితే సుదేహకు తన చెల్లెలు ఘుష్మా కుటుంబం నవ్వుతూ ఉండడం.. పిల్లాడితో ఆడుకోవడం చూసిన సుదేహలో తన చెల్లెలుపై అసూయ మొదలైంది. దీంతో ఘుష్మ బిడ్డను చంపి చెరువులో పడేసింది.

భక్తురాలి కుమారుడిని మళ్ళీ బతికించిన శివుడు

ఈ విషయం తెలుసుకున్న ఘుష్మ ఎంతగానో దుఃఖించింది. అయితే శివుడికి పూజకు వేళ అవ్వడంతో తన దుఃఖాన్ని మరచి మళ్లీ యథావిధిగా శివపూజలో మునిగిపోయింది. మహాదేవుడు తన భక్తురాలి భక్తికి సంతోషించాడు. శివుని ఆశీర్వాదంతో ఘుష్మ కుమారుడు మళ్లీ బ్రతికాడు. లోక కల్యాణం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని ఘుష్మ శివుడిని ప్రార్థించింది. శివుడు ఘుష్మ కోరికను అంగీకరించిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసించడం ప్రారంభించాడు. తాను ఇక్కడ ఎల్లప్పుడూ నివసిస్తాను.. నీ పేరుతో ఘుష్మేశ్వర్ అని పిలువబడుతూ పూజలను అందుకుంటాడు అని వరం ఇచ్చాడు.

సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే క్షేత్రం

ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగ సమీపంలో ఒక సరస్సు కూడా ఉంది. ఘుష్మ చేసిన శివలింగాలను నిమజ్జనం చేసేది ఇదే చెరువు. ఈ నది ఒడ్డున ఆమె తన కొడుకును సజీవంగా పొందింది. జ్యోతిర్లింగంతో పాటు ఈ సరస్సును కూడా భక్తులు సందర్శిస్తారు. ఘృష్ణేశ్వర స్వామి దర్శించుకున్న భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. సంతానంని దంపతులు ఇక్కడ దర్శించి పూజలు చేస్తే సంతానం పొందుతారు .జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు