Ranganatha Temple: ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?

భారతదేశం సర్వమత సమ్మేలనం. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు కూడా బహుశా ఏ దేశంలో ఉండవేమో. అందుకే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అంటే..

Ranganatha Temple: ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?
Liquor Served To God

Updated on: Apr 05, 2021 | 4:20 PM

భారతదేశం సర్వమత సమ్మేలనం. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు కూడా బహుశా ఏ దేశంలో ఉండవేమో. అందుకే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అంటే ప్రపంచ దేశాలకు కూడా ఆసక్తి. కాగా ఇప్పుడు మీకు ఓ విభిన్న సాంప్రదాయం పాటించే దేవాలయం గురించి చెప్పబోతున్నాం. కర్ణాటక బాగల్​కోటే జిల్లా గులేద్​గుడ్డా కేలవడి గ్రామంలోని ప్రాచీన రంగనాథ గుడిలో మిగతా దేవాలయాల కంటే భిన్నంగా మందు బాటిల్​ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా కార్యక్రమాల తర్వాత ఆ మందును తీర్థంగా పంచుతారు.

సంవత్సరానికి ఓసారి వచ్చే జాతర సమయంలో స్వామి వారికి ఇలా మందు నైవేద్యం సమర్పిస్తారు భక్తులు. పూజ అనంతరం ఆ మద్యంలో నీటిని కలపకుండా సేవిస్తే.. ఎలాంటి సమస్యలు రావని భక్తుల విశ్వాసం. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో.. ఈ ఏడాది రంగనాథ స్వామి జాతర నిరాడంబరంగా జరిగింది. ఈ దేవాలయం చారిత్రకమైనదని.. రంగనాథ స్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తులు చెబుతున్నారు. ఈ లిక్కర్ తీర్థం తాగితే.. ఎలాంటి సమస్యలు రావని అక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.

అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి..?

పూర్వం.. రాక్షసులను వధించేందుకు వచ్చిన రంగనాథ స్వామి.. శత్రు మూకను సంహరించాక మందును సేవించారని.. ఆ తర్వాత భక్తుల కోర్కెలను తీర్చారని ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది.  అప్పటినుంచి భక్తులు మందు బాటిల్​ను స్వామివారికి నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీగా వస్తుందని, ఆలయ అర్చకులు, అధికారులు చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ ఉత్తర్వులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన మహిళ.. రూ.4.5 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

Loading...
Unable to load recommendations.
Follow Us