
బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహరిలోని కైత్వాలియా గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ స్థాపన కోసం ఒక క్రేన్ను ఉపయోగించారు. వారణాసి, అయోధ్య నుండి వచ్చిన పండితులు మంత్రోచ్ఛారణల మధ్య శివలింగానికి ప్రాణప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు చేసి, హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించారు. ఈ సందర్భాన్ని వీక్షించడానికి అనేక మంది సాధువులు, ఋషులు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంతకు ముందే అతి పెద్ద శివలింగాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో సహస్ర శివలింగాన్ని సృష్టించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం 210 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. విరాట్ రామాయణ ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. భారీ శివలింగాన్ని ఎత్తడానికి రెండు పెద్ద క్రేన్లను తీసుకువచ్చారు. భారీ క్రేన్ల సహాయంతో, శివలింగాన్ని ప్రతిష్టించారు. శివలింగ ప్రతిష్టాపన తర్వాత, హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించారు. భోలేనాథ్పై దేశంలోని అనేక పవిత్ర నదుల నీటితో అభిషేకం చేశారు.
दुनिया के सबसे बड़े शिवलिंग को बिहार के केसरिया में किया गया स्थापित । #Shivling #Bihar pic.twitter.com/d2KhomfS2j
— Raman Rai (@journal_raman) January 17, 2026
ఈ 33 అడుగుల పొడవైన శివలింగం పూర్తిగా గ్రానైట్తో రూపొందించడం జరిగింది. దాదాపు 210 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ శివలింగంగా భావిస్తున్నారు. ఇందులో 1008 చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి దీని పేరు సహస్ర లింగంగా నామకరణం చేశారు. బీహార్లోని తూర్పు చంపారన్లో ఒక గొప్ప రామాయణ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. పూర్తయిన తర్వాత, దాని ప్రధాన శిఖరం 270 అడుగులు పెరుగుతుంది. ఇది అయోధ్యలోని రామాలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. రామాయణ ఆలయాన్ని 120 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తైతే, విరాట్ రామాయణ ఆలయం చరిత్రలో నిలిచిపోనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..