Lunar Eclipse 2024: చంద్ర గ్రహణ సమయంలో పితృ పక్షం ప్రారంభం.. మీ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను ఎలా చేయాలంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం చంద్రగ్రహణంతో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 18న ప్రతిపాద శ్రాద్ధ కర్మతో పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం కూడా అదే రోజున ఏర్పడనుంది. ఈ పితృ పక్షం అంత శుభప్రదమైనది కాదు. సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక ఈ చంద్ర గ్రహణ సమయం భారతదేశంలో సుతక సమయంగా పరిగణించబడదు.

Lunar Eclipse 2024: చంద్ర గ్రహణ సమయంలో పితృ పక్షం ప్రారంభం.. మీ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను ఎలా చేయాలంటే..
Pitru Paksha 2024
Follow us

|

Updated on: Sep 06, 2024 | 3:37 PM

హిందూ మతంలో పితృ పక్షం ఒకరి పూర్వీకులకు నివాళులు అర్పించే ముఖ్యమైన సమయం. ఈ సమయంలో పూర్వీకులకు శ్రద్ధ, తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. అయితే ఈ సంవత్సరం చంద్రగ్రహణం నీడలో పితృ పక్షం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో పూర్వీకులు విముక్తి పొందడంతో పాటు వారి అనుగ్రహం ఎలా పొందాలో అనే ప్రశ్న ఉదయిస్తుంది. పితృ పక్షంలో చంద్రగ్రహణం వంటి ఖగోళ సంఘటన సంభవించినప్పుడు.. శ్రాద్ధ కర్మల నియమాలలో కొన్ని మార్పులు ఉన్నాయి. గ్రహణ సమయాన్ని అశుభంగా హిందువులు భావిస్తారు. కనుక గ్రహణ కాలంలో పుజదికార్యక్రమలను నిర్వహించరు. అయితే ఇప్పుడు పితృ పక్షంలో చంద్రగ్రహణం సంభవించనుంది. దీంతో పూర్వీకులతో ముడిపడి ఉన్న ప్రత్యేక సమయం కాబట్టి మరింత ముఖ్యమైనది.

ఈసారి పితృ పక్షంలోనే సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం చంద్రగ్రహణంతో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 18న ప్రతిపాద శ్రాద్ధ కర్మతో పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం కూడా అదే రోజున ఏర్పడనుంది. ఈ పితృ పక్షం అంత శుభప్రదమైనది కాదు. సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక ఈ చంద్ర గ్రహణ సమయం భారతదేశంలో సుతక సమయంగా పరిగణించబడదు. అయితే ఈ గ్రహణం పూర్వీకుల వైపు ప్రభావం చూపుతుంది.

పంచాంగం ప్రకారం.. చంద్రగ్రహణం ఉదయం 6:12 గంటలకు ప్రారంభమై 10:17 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో కనిపించని కారణంగా.. ఈ గ్రహణం ఎటువంటి ప్రభావం చూపదు. అయినప్పటికీ శ్రద్ధ కర్మలు చేసే వ్యక్తులు గ్రహణ కాలం ముగిసే వరకు శ్రాద్ధ కర్మలు చేయకూడదని గుర్తుంచుకోవాలి. గ్రహణ కాలం ముగిసిన తర్వాత మాత్రమే ఎటువంటి కర్మలనైనా మొదలు పెట్టాలి.

ఇవి కూడా చదవండి

పూర్వీకులను ఎలా సంతోష పెట్టాలంటే

పితృ పక్షం సమయంలో మన పూర్వీకులు భూమికి వస్తారని నమ్మకం. పితృ పక్షం భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉంటుంది. ఈ కాలంలో పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం, పిండ ప్రదానం తదితర కర్మలను నిర్వహిస్తారు. ఇలా చేయడం వలనా పూర్వీకులు సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారని నమ్మకం. చంద్రగ్రహణం సమయంలో పితృ పక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులకు విముక్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

పితృ శాంతి కోసం చేయాల్సిన చర్యలు ఏమిటంటే

చంద్రగ్రహణం సమయంలో పూర్వీకులను విముక్తి చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. గ్రహణ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయడం నిషిద్ధం. గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే శుభ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయాలి. గ్రహణ సమయంలో ప్రత్యేక మంత్రాలు జపించి పేదలకు దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుంది. గ్రహణం తరువాత పూర్వీకులను స్మరించుకోండి. వారికి నివాళులర్పించి, మతపరమైన గ్రంథాలను పఠించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి