వైశాఖ పూర్ణిమ ను బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి మరియు బుద్ధ జన్మోత్సవం అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి బౌద్ధ మతస్థులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది బుద్ధు భగవానుడు జన్మించిన రోజు. అంతేకాదు బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిన రోజు, అంతేకాదు మహాపరినిర్వాణం చెందిన పరమ పవిత్రమైన రోజు. ఈ సంవత్సరం 2024లో బుద్ధ పూర్ణిమ గురువారం మే 23న జరుపుకోనున్నారు. ఇది చాలా పవిత్రమైన రోజు.
వైశాఖ మాసంలో చేసే దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రకరకాల సందర్భాలను పురష్కరించుకుని రకరకాల విరాళాలు ఇస్తుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల వ్యక్తులకు జ్ఞానం లభిస్తుందని.. అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఒక నమ్మకం. శాంతి కలుగుతుంది. బుద్ధ పూర్ణిమ రోజున దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
బుద్ధ పూర్ణిమ రోజున చేసే దానం ఆధ్యాత్మిక సంతృప్తిని అందించడమే కాదు.. జీవితంలో సానుకూల మార్పులను కూడా తెస్తుంది. విశ్వాసం, ఆర్ధిక శక్తి సామర్ధ్యాల మేరకు ఏదైనా వస్తువులను దానం చేయవచ్చు. లేదా విరాళం అందించడానికి ఏదైనా సామాజిక సంస్థ లేదా ప్రభుత్వేతర సంస్థ (NGO)లో కూడా చేరవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు