Badvel By Election: బద్వేల్ ప్రచారంలో అధికార పార్టీ దూకుడు.. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతల మోహరింపు

|

Oct 26, 2021 | 4:52 PM

బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతలు వచ్చి బద్వేల్‌లో ప్రచారం

Badvel By Election: బద్వేల్ ప్రచారంలో అధికార పార్టీ దూకుడు.. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతల మోహరింపు
Mla Roja
Follow us on

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతలు వచ్చి బద్వేల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ నియోజయవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఓటర్లు వైసీపీకే మద్దతు తెలుపుతున్నారని.. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందాయని ఆయన చెప్తున్నారు. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతుందని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని.. తమకు ఆ అవసరం లేదంటున్న చెవిరెడ్డి.. కేంద్ర బలగాలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తామని చెప్తున్నారు.

బద్వేల్‌ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని, వారు ప్రజల మన్ననలను చూరగొన్నారన్నారు. చిత్తూరు జిల్లా నుంచి కూడా ఇద్దరు సీఎంలుగా పని చేశారని, ఒకర మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయయారని, మరొకరైన కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా వాసులు ఇక్కడి సీఎంలను చూసి గర్వపడాలన్నారు.

మరోవైపు, బద్వేల్ లో ఇవాళ ఎమ్మెల్యే రోజా సైతం ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పుకొచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానాన్ని బద్వేల్‌ ఉప ఎన్నికలో చూపించాలని అభ్యర్థించారు.

మహిళా సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని, వైయస్‌ఆర్‌సీపీకి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పిలుపునిచ్చారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.

బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గోపవరం మండలం రాచాయపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read also: Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్