జగన్ సమక్షంలో వైసీపీ జెండాలు దగ్ధం..!

|

Mar 23, 2019 | 8:43 PM

పాడేరులో వైసీపీ అధినేత జగన్‌ ఎన్నికల ప్రచార సభ రసాభాసగా మారింది. పాడేరు వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జగన్ సమక్షంలోనే పాడేరు వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాడేరు సమన్వయకర్త విశ్వేశ్వరరాజు అభిమానులు నినాదాలు చేశారు. జగన్ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే వైసీపీ జెండాలు, ప్లెక్సీలను విశ్వేశ్వరరాజు వర్గీయులు తగలబెట్టారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా… ఆ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బాలరాజును పోలీసులు కొట్టినట్లు […]

జగన్ సమక్షంలో వైసీపీ జెండాలు దగ్ధం..!
Follow us on

పాడేరులో వైసీపీ అధినేత జగన్‌ ఎన్నికల ప్రచార సభ రసాభాసగా మారింది. పాడేరు వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జగన్ సమక్షంలోనే పాడేరు వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాడేరు సమన్వయకర్త విశ్వేశ్వరరాజు అభిమానులు నినాదాలు చేశారు. జగన్ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే వైసీపీ జెండాలు, ప్లెక్సీలను విశ్వేశ్వరరాజు వర్గీయులు తగలబెట్టారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా… ఆ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బాలరాజును పోలీసులు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారట.

కాగా వైసీపీ తరుపున పాడేరు నియోజకవర్గం నుంచి భాగ్యలక్ష్మి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గిడ్డి ఈశ్వరి గెలిచారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమె టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఈశ్వరి పోటీ చేస్తున్నారు.