TDP – YCP: మాకు అవమానం జరిగింది.. లోకేష్‌పై SC-ST అట్రాసిటీ కేసు పెట్టండి.. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్..

|

Aug 18, 2021 | 2:20 PM

గుంటూరులో ఉన్నత చదువులు చదువుతున్న దళిత బిడ్డ రమ్య హత్యను TDP నాయకుడు నారా లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని YCP ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. రమ్య హత్య గురించి తెలియగానే...

TDP - YCP: మాకు అవమానం జరిగింది.. లోకేష్‌పై SC-ST అట్రాసిటీ కేసు పెట్టండి.. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్..
Nara Lokesh
Follow us on

గుంటూరులో ఉన్నత చదువులు చదువుతున్న దళిత బిడ్డ రమ్య హత్యను TDP నాయకుడు నారా లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని YCP ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. రమ్య హత్య గురించి తెలియగానే CM జగన్ వెంటనే స్పందించారని.. ఆ కుటుంబానికి అండగా నిలిచి నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారని తెలిపారు. బాధిత కుటుంబానికి బాసటగా నిలుస్తూ ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేసిందన్నారు. ఆస్పత్రిలో శవ పంచనామా కూడా దగ్గరుండి చేయించి మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే…దాన్ని తరలించకుండా టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించి అడ్డుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

”కేవలం నారా లోకేష్‌ కోసమే రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలించకుండా టీడీపీ నాయకులు ఆపారు. అక్కడ కూడా రాజకీయం చేస్తూ పార్టీ జెండాలు కట్టారు. ఆ తర్వాత ఎలాగోలా రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలిస్తే అక్కడా లోకేష్ రాజకీయం చేశాడు. ఆమె ఇంటి గేటు వద్ద 45 నిమిషాలు నిలబడిపోయారు. దీంతో ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లడం కష్టంగా మారింది” అని తెలిపారు.

”రమ్య తల్లి తమకు న్యాయం చేయమని అడిగితే ఆ ఫోటోతో కూడా విపక్షం రాజకీయం చేసింది. నిజానికి రమ్య హత్య తర్వాత కొన్ని గంటల్లోనే నిందితుణ్ని అరెస్టు చేయడం జరిగింది. తమ బిడ్డను అన్యాయంగా చంపారని, తమకు న్యాయం చేయాలని రమ్య తల్లి కోరింది. ” అని మండిపడ్డారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున.

ఇవి కూడా చదవండి:  Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇవాళే ప్లాన్ చేసుకోండి.. రేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవులు..

స్వాతంత్య్ర పోరాట యోధులంటూ తాలిబన్లకు ఎంపీ ప్రశంసలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..