ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రాలా..?
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్సైట్ ఎందుకు నిలపివేశారో.. తండ్రి, కొడుకులు సమాధానం చెప్పాలన్నారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సమాచారాన్ని తొలగించేందుకే వెబ్సైట్ని నిలిపివేశారా..? అని నిలదీశారు. బాబు, లోకేష్ సైబర్ స్టోరీలపై ప్రజలు షాక్కు గురయ్యారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రలా అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్సైట్ పని చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డేటా […]
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్సైట్ ఎందుకు నిలపివేశారో.. తండ్రి, కొడుకులు సమాధానం చెప్పాలన్నారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సమాచారాన్ని తొలగించేందుకే వెబ్సైట్ని నిలిపివేశారా..? అని నిలదీశారు. బాబు, లోకేష్ సైబర్ స్టోరీలపై ప్రజలు షాక్కు గురయ్యారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రలా అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.
టీడీపీ వెబ్సైట్ పని చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ పనిచేయడం లేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.