తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య వచ్చే నెలలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో సండ్ర టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ఇప్పటికే ఆయన తన అనుచరులకు తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని, అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కాగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ సండ్ర తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.