AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే దిశగా కీలక అడుగు.. మూడు ప్రధాన నగరాల పేర్లు మార్పు..!

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెర లేపింది. రాష్ట్రంలోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూతో సహా మూడు ప్రధాన నగరాల పేరు మార్చుతున్నట్లు రాష్ట్ర సర్కాన్ ప్రకటించింది. మౌంట్ అబూ ఇప్పుడు అబూ రాజ్ గా పిలువనున్నారు. సిరోహి జిల్లాలో ఉన్న మౌంట్ అబూ, రాజస్థాన్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది.

చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే దిశగా కీలక అడుగు.. మూడు ప్రధాన నగరాల పేర్లు మార్పు..!
Rajasthan Chief Minister Bhajanlal Sharma
Balaraju Goud
|

Updated on: Feb 28, 2026 | 11:41 AM

Share

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెర లేపింది. రాష్ట్రంలోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూతో సహా మూడు ప్రధాన నగరాల పేరు మార్చుతున్నట్లు రాష్ట్ర సర్కాన్ ప్రకటించింది. మౌంట్ అబూ ఇప్పుడు అబూ రాజ్ గా పిలువనున్నారు. సిరోహి జిల్లాలో ఉన్న మౌంట్ అబూ, రాజస్థాన్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. అలాగే, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జహజ్‌పూర్ పేరును యజ్ఞపూర్‌గా మార్చనున్నారు. జహజ్‌పూర్ భిల్వారా జిల్లాలోని ఒక చారిత్రాత్మక పట్టణం, ఇది పురాతన మత, సాంస్కృతిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. మరోవైపు, కామా పేరును కమ్వాన్‌గా మార్చనున్నారు. ఈ నగరం కమాన్ డీగ్ జిల్లాలో ఉంది. బ్రజ్ ప్రాంత సంస్కృతికి లోతుగా సంబంధం ఉన్నట్లు భావిస్తారు.

రాజస్థాన్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ మూడు నగరాల పేర్ల మార్పు ప్రకటన చేశారు. స్థానిక నివాసితుల డిమాండ్లు, చారిత్రక సందర్భం, సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. త్వరలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం తర్వాత, మూడు నగరాల్లోనూ వేడుకల వాతావరణం నెలకొంది. కొత్త పేర్లు తమ సంప్రదాయాలను, గుర్తింపును మరింత బలోపేతం చేస్తాయని స్థానికులు అంటున్నారు. చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే దిశగా ఇది ఒక అడుగు అని అనేక స్థానిక సంస్థలు ప్రశంసించాయి.

అయితే, ఈ అంశంపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ పేరు మార్పును నేరుగా వ్యతిరేకించలేదు, కానీ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రశ్నలను లేవనెత్తింది. రాజస్థాన్ కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జ్, ప్రధాన కార్యదర్శి స్వర్ణిమ్ చతుర్వేది, ఈ నగరాల్లో రోడ్లు, నీరు, ఆరోగ్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం పేర్లు మార్చడం కంటే ముఖ్యమని పేర్కొన్నారు. నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ఆరోపించారు.

ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రభుత్వ ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికింది. ఇప్పుడు అందరి దృష్టి అధికారిక నోటిఫికేషన్, తదుపరి ప్రక్రియపై కేంద్రీకృతమై ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us