జగన్కు ఓపికున్నంత వరకు ఆయనే సీఎం.. పోసాని
ఏపీ సీఎం జగన్పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పనితీరు ఇలానే ఉంటే.. జగన్ అలసిపోయే వరకు.. అతనే సీఎంగా కొనసాగుతారని అన్నారు. టీవీ9తో జరిగిన ముఖామకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన జీవితంలో ఒక కల ఉండేదని. .అది జగన్ సీఎం అవ్వడం అని అన్నారు. మొత్తానికి నా కల నెరవేరిందని పేర్కొన్నారు. అయితే గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలు.. ఎవరో చెప్తే చెయ్యలేదని అన్నారు. అంతకుముందు […]
ఏపీ సీఎం జగన్పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పనితీరు ఇలానే ఉంటే.. జగన్ అలసిపోయే వరకు.. అతనే సీఎంగా కొనసాగుతారని అన్నారు. టీవీ9తో జరిగిన ముఖామకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన జీవితంలో ఒక కల ఉండేదని. .అది జగన్ సీఎం అవ్వడం అని అన్నారు. మొత్తానికి నా కల నెరవేరిందని పేర్కొన్నారు. అయితే గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలు.. ఎవరో చెప్తే చెయ్యలేదని అన్నారు. అంతకుముందు తాను ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లకు మరియు పీ జనార్థన్ రెడ్డిలకు మద్దతు తెలిపానని తెలిపారు. ఇక 2024లో రాజకీయ పరిస్థితులు ఏలా ఉంటాయన్న దానికి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలన తీరు ఇదే విధంగా ఉంటే.. టీడీపీ.. లాంటి పార్టీలతో పనికూడా లేదని.. చంద్రబాబు వంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం కూడా ఉండదన్నారు. ప్రజలకు సేవచేయడానికి పరిపక్వత అవసరం లేదని.. నీతి నిజాయితీతో పాటు.. మానవత్వం కలిగి ఉంటే సరిపోతుందన్నారు. జగన్లో ఆ మానవత్వం పుష్కలంగా ఉందన్నారు.