AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో టీడీపీ నేతలపై ఆగని కేసుల పర్వం.. తాజాగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై కేసు నమోదు

ఏపీలో సీనియర్‌ నేత, గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై..

ఏపీలో టీడీపీ నేతలపై ఆగని కేసుల పర్వం.. తాజాగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై కేసు నమోదు
K Sammaiah
|

Updated on: Feb 12, 2021 | 10:21 AM

Share

ఏపీలో సీనియర్‌ నేత, గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

144 సెక్షన్‌ను ఉల్లంఘించి పోలీస్ స్టేషన్ వద్ద తన మద్దతుదార్లతో గుమికూడారంటూ ఆయనతోపాటు వినుకొండ మండల మాజీ అధ్యక్షుడు మక్కెన కొండలు, శివశక్తిలీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ గాలి రమణ, మరో 100 మందిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

అలాగే, పిట్టంబండ గ్రామానికి వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మక్కెన కొండలు సహా మరికొందరిపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ప్రోద్భలంతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more:

జీతాలు పెంచమంటే వాలంటీర్లంటారా..? ఎమ్మెల్యే.. ఎంపీలు ప్రజా సేవకులు కాదా.. వారికి జీతాలెందుకు -రామకృష్ణ