ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్‌

| Edited By:

Aug 13, 2020 | 3:54 PM

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు.

ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్‌
Follow us on

penumatsa suresh babu: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కాగా రాజ్యసభకు ఎన్నికైన  మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివ రాజు తనయుడు సురేష్‌ బాబు పేరును సీఎం వైఎస్ జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్‌ దాఖలకు ఈ నెల 13 ఆఖరి తేదీ కాగా.. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది.

Read More:

జాకీచాన్‌, టోనీ జా నన్ను ప్రశంసించారు

ఆ వివరాలన్నీ డిస్‌ప్లేలో పెట్టండి: ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశం