Revanth Reddy: నేను సోనియాగాంధీ మనిషిని.. కాంగ్రెస్ బిడ్డను..ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు..

|

Jun 30, 2021 | 2:56 PM

తాను సోనియాగాంధీ మనిషినని.. కాంగ్రెస్ పార్టీ బిడ్డనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  తన కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌కి పనిచేసిందన్నారు. తనపై కాంగ్రెస్ పార్టీ పెద్ద బాధ్యతను...

Revanth Reddy: నేను సోనియాగాంధీ మనిషిని.. కాంగ్రెస్ బిడ్డను..ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ నేతలను కలుసుకుంటున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన టీపీసీసీ అధ్యక్ష ప‌ద‌వి బాధ్యతలను రేవంత్ రెడ్డి స్వీక‌రించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలకు ఆయన ఆహ్వానం పంపుతున్నారు.
Follow us on

తాను సోనియాగాంధీ మనిషినని.. కాంగ్రెస్ పార్టీ బిడ్డనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  తన కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌కి పనిచేసిందన్నారు. తనపై కాంగ్రెస్ పార్టీ పెద్ద బాధ్యతను పెట్టిందన్నారు. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు. అందరి సహకారం  కావాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో అందరూ భాగస్వామ్యం కావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి అంటే ఎలా ఉంటుందో ఎవరు చూడలేదన్నారు.. కానీ నిజమైన తెలంగాణ తల్లి అంటే సోనియాగాంధీ అని చెప్పుకొచ్చారు. కన్నా తల్లి తరువాత మనం దండం పెట్టాలి అంటే అది సోనియా గాంధీకి మాత్రమే వెల్లడించారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలిని పిలుపునిచ్చారు. అదును చూసి అధికార పార్టీ ఎన్నికల కు వెళ్తుందని… సోనియా గాంధీ సైనికులమైన మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కష్టాలను చూసి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారన్నారు.

ఇవి కూడా చదవండి : Supreme Court: అల్లోపతిపై మీరు చేసిన అసలు రికార్డులు సమర్పించండి.. బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు