విశాఖ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు తన గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన విశాఖ జిల్లాలో పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
ఒక అవినీతి పరుడికి, తనకు పవన్ కల్యాణ్ సమాన దూరం అంటారా అని విమర్శించారు. ఒక నేరస్తుడ్ని, తనను ఒకే గాటన కట్టి సమదూరం పాటించడం సరికాదని అన్నారు. రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల పక్షాన ఉంటారో పవన్ తేల్చుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్, కేసీఆర్, మోడీ కలిసి రాష్ట్రంపై గద్దల్లా పడుతున్నారని మండిపడ్డారు.