Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరుణానిధి మనవరాలికి నాన్‌బెయిలబుల్ వారెంట్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయలేదన్న ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన అంజుగ సెల్వి 2009-10 సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేయలేదు. దాదాపు 70లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు […]

కరుణానిధి మనవరాలికి నాన్‌బెయిలబుల్ వారెంట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 08, 2019 | 10:29 AM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయలేదన్న ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన అంజుగ సెల్వి 2009-10 సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేయలేదు. దాదాపు 70లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. దానికి ఆమె స్పందించకపోవడంతో పాటు డబ్బు కూడా చెల్లించకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు అంజుగ సెల్వి అరెస్ట్‌కు ఆదేశాలిచ్చింది.