Jagga Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తరుణాన వనదేతల దర్శనానికి జగ్గారెడ్డి

|

Jun 30, 2021 | 11:23 PM

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ములుగు జిల్లా మేడారంలో కొలువైన సమ్మక్క, సారక్క దేవతలను దర్శించుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..

Jagga Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తరుణాన వనదేతల దర్శనానికి జగ్గారెడ్డి
Jagga Reddy
Follow us on

Jagga Reddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ములుగు జిల్లా మేడారంలో కొలువైన సమ్మక్క, సారక్క దేవతలను దర్శించుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తర్వాత వనదేతలను దర్శించుకొని…పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గట్టమ్మగుట్టకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. వనదేతల్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు జగ్గారెడ్డి. సమ్మక్క-సారక్క దీవెనలు ఎల్లప్పుడు రాష్ట్ర ప్రజలకు ఉండాలని…రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అమ్మవార్లను వేడుకున్నట్లుగా జగ్గారెడ్డి తెలిపారు. సమ్మక్క-సారక్క దేవతల్ని దర్శించుకునేందుకు వచ్చిన జగ్గారెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

Read also: తెలంగాణ పల్లెల్లో బీహారీ గ్యాంగ్ బీభత్సకాండ.. రాడ్లు, కర్రలతో రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వారిపై దాడులు.!