గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ నేత నారా లోకేశ్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మంగళగిరిలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట తల్లి నారా భువనేశ్వరి, భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నారు. కాగా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నారా లోకేశ్. అనేక సమీకరణాల తరువాత మంగళగిరి నుంచి లోకేశ్ను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
@naralokesh filed nomination from Mangalagiri constituency ! ✌️✌️✌️ pic.twitter.com/LPalQXGHSX
— మన అమరావతి – మన రాజధాని ? (@AKNarne) March 22, 2019