కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన నామా

|

Mar 21, 2019 | 2:16 PM

ఖమ్మం: టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నామాకు పార్టీ కండువా కప్పి ఆయనను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేటీఆర్. నామా చేరికతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలం పెరిగినట్టేనని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నామాను మరికొద్దిసేపట్లో ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్ధిగా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్‌లో చేరిన అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను బలోపేతం […]

కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన నామా
Follow us on

ఖమ్మం: టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నామాకు పార్టీ కండువా కప్పి ఆయనను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేటీఆర్. నామా చేరికతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలం పెరిగినట్టేనని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

నామాను మరికొద్దిసేపట్లో ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్ధిగా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్‌లో చేరిన అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను బలోపేతం చేస్తానని చెప్పారు. కార్యకర్తలందరినీ కలుపుకుపోయిపని చేస్తానని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు చేసి తాను పార్టీలో చేరినట్టు నామా తెలిపారు.