AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో తెలంగాణ హోంమంత్రి.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన మహమూద్‌ అలీ

తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా..

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో తెలంగాణ హోంమంత్రి.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన మహమూద్‌ అలీ
K Sammaiah
|

Updated on: Mar 02, 2021 | 1:01 PM

Share

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మొక్కలు నాటుతూ పర్యావరణ రక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం పథకానికి గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ తోడుగా నిలుస్తుంది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజునాడు మొక్కులు నాటడం ఆనవాయితీగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంమైంది. ఒక్క రోజులో ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 50 దేశాల్లో చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి మరింత విస్తృత గుర్తింపు లభించినట్టయితే

తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహమూద్‌ అలీ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా మలక్ పెట్ అజంపురా లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో హోంమంత్రి మహమ్మద్ అలీ మొక్కలు నాటారు.

అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. జన్మదిన సందర్భంగా ఇతర కార్యక్రమాలు చేపట్టకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మొక్కలు నాటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం చాలా విజయవంతం అయిందని ఈ సందర్భంగా మహమూద్‌ అలీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు ఆజం హలీ ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ,కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి ,తీగల సునరీతా రెడ్డి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మహమూద్ అలీకి మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు:

అంతకు ముందు హోం మంత్రి మహమూద్‌ అలీకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీని జన్మదినోత్సవం సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.

Read more:

కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!