AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో పార్టీల మధ్య ఊపందుకున్న వలసలు

ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పార్టీల మధ్య నాయకుల వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం, వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న గౌరు ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరనుండగా.. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై […]

ఏపీలో పార్టీల మధ్య ఊపందుకున్న వలసలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:26 PM

Share

ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పార్టీల మధ్య నాయకుల వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం, వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న గౌరు ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరనుండగా.. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన గౌరు దంపతులు టీడీపీ అధినేతతో అమరావతిలో భేటీ కానున్నారు

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పలు సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచారు. కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనసు మార్చుకున్నారు కోట్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాంగ్రెస్ నేతగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత.. తమ పార్టీలోకి రావడం అదనపు బలమే అని అంచనా వేస్తోంది టీడీపీ.

ఇక పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి వైసీపీలో కొనసాగిన గౌరు కుటుంబం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయింది. ఈ నెల 9న పసుపు కండువా కప్పుకుంటామని గౌరు దంపతులు ఇప్పటికే ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం నిన్న కర్నూల్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తిని కలిశారు. ఇవాళ అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. అయితే వైఎస్ కుటుంబంతో బంధం తెంచుకుంటామని తాము ఎప్పుడూ అనుకోలేదని గౌరు వెంకటరెడ్డి, గౌరు చరిత అన్నారు. మొదటి నుంచీ తాము పార్టీకి విధేయులుగా ఉన్నామనీ.. కానీ 10 నెలలుగా పార్టీలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని గౌరు దంపతులు ఆరోపించారు. పాణ్యం టికెట్ ఇవ్వలేనని చెప్పడంతో తాము వైసీపీని వీడుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్లో ఉన్న భరోసా జగన్ దగ్గర కనపడలేదని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం