ఈ ‘పీకే’తో లాభం కన్నా.. ఆ ‘పీకే’తోనే చంద్రబాబుకు నష్టం: జోగయ్య జోస్యం

చంద్రబాబు తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం ఓట్లను రాలుస్తుందని ఆయన భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొంటి వెంకట హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ పీకే(పసుపు-కుంకుమ)తో లాభం కన్నా.. పవన్ కల్యాణ్(పీకే)స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గత ఎన్నికలతో పోలిస్తే.. ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ వైసీపీ ఆకట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు. మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని.. దీనివలన జగన్ […]

ఈ ‘పీకే’తో లాభం కన్నా.. ఆ ‘పీకే’తోనే చంద్రబాబుకు నష్టం: జోగయ్య జోస్యం
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 1:24 PM

చంద్రబాబు తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం ఓట్లను రాలుస్తుందని ఆయన భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొంటి వెంకట హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ పీకే(పసుపు-కుంకుమ)తో లాభం కన్నా.. పవన్ కల్యాణ్(పీకే)స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక గత ఎన్నికలతో పోలిస్తే.. ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ వైసీపీ ఆకట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు. మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని.. దీనివలన జగన్ ఎన్నో ఓట్లను నష్టపోయారని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ 90 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని.. అధికార, విపక్ష పార్టీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుందని జోగయ్య జోస్యం చెప్పారు.