AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ‘ బూచి ‘ ని చూసి భయపడకండి !

తెలంగాణాలో బీజేపీ ‘ బూచి ‘ ని చూసి భయపడవద్దని సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, విమర్శలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి స్పందించరాదని అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు పార్టీ నాయకత్వమే సరైన సమాధానమిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కమలం పార్టీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. కానీ టీఆర్ఎస్ కు వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, […]

బీజేపీ ' బూచి ' ని చూసి భయపడకండి !
Pardhasaradhi Peri
| Edited By: Nikhil|

Updated on: Jun 28, 2019 | 2:24 PM

Share

తెలంగాణాలో బీజేపీ ‘ బూచి ‘ ని చూసి భయపడవద్దని సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, విమర్శలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి స్పందించరాదని అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు పార్టీ నాయకత్వమే సరైన సమాధానమిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కమలం పార్టీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. కానీ టీఆర్ఎస్ కు వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 32 మంది జెడ్పీ చైర్మన్లు ఉన్నారని, పైగా ప్రజల సహకారంతో రాష్ట్రంలో మనదే పెద్ద పార్టీగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతో తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న సూచనను తోసిపుచ్చారు. త్వరలో జరిగే ఈ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

టీవీ చర్చల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడరాదని తమ పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీ అనుమతి లేనిదే టీవీ డిబేట్లలో పాల్గొనరాదని, కానీ పాల్గొన్న పక్షంలో సస్పెన్షన్ వేటు పడడం ఖాయమని ఆయన హెచ్చరించారు. టీవీ డిబేట్లలో పాల్గొనే అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.ఈ కమిటీ ఓ నియమావళిని రూపొందించవచ్చునని సూచనప్రాయంగా పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు పూర్తి అయిన తరువాత గ్రామ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ఆయన వివరించారు. పార్టీలో కొత్తగా సభ్యులను చేర్పించడంలో నేతలు టార్గెట్ ను సాధించలేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఎమ్మెల్యే కనీసం 50 వేలమందిని సభ్యులుగా చేర్పించాలని ఆయన టార్గెట్ విధించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ సందర్భంగా కేసీఆర్ మొట్టమొదట మెంబర్ షిప్ స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని యుధ్ధప్రాతిపదికన చేపట్టాలని కూడా ఆయన సూచించారు.

రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'
విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వన్డే క్రికెట్‌లో అధిక సింగిల్స్ తీసిన టాప్ బ్యాట్స్‌మెన్ వీళ్లే
వన్డే క్రికెట్‌లో అధిక సింగిల్స్ తీసిన టాప్ బ్యాట్స్‌మెన్ వీళ్లే
రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు
రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు