ఆ రోజే వివేకా హత్యకు కుట్ర మొదలైంది: వాసిరెడ్డి పద్మ

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనక మహా కుట్ర ఉందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఆదినారాయణ రెడ్డిని ప్రకటించినప్పుడే కుట్ర మొదలైందని ఆరోపించారు. కడపను, పులివెందలను గెలుస్తామని టీడీపీ నేతలు పదే పదే చెప్పారని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యల వెనక అంతరార్ధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అందుకే తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదని, నిష్పక్షిపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరిపించాలని చెప్పారు. […]

ఆ రోజే వివేకా హత్యకు కుట్ర మొదలైంది: వాసిరెడ్డి పద్మ

Updated on: Mar 15, 2019 | 6:00 PM

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనక మహా కుట్ర ఉందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఆదినారాయణ రెడ్డిని ప్రకటించినప్పుడే కుట్ర మొదలైందని ఆరోపించారు. కడపను, పులివెందలను గెలుస్తామని టీడీపీ నేతలు పదే పదే చెప్పారని ఆమె అన్నారు.

ఈ వ్యాఖ్యల వెనక అంతరార్ధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అందుకే తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదని, నిష్పక్షిపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరిపించాలని చెప్పారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఎలాంటి పనులు చేశారో అందరికీ తెలుసని వాసిరెడ్డి పద్మ అన్నారు.