AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డ చంద్రబాబు

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. డేటా వార్ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు కేసీఆరేనని చంద్రబాబు అన్నారు. అలాగే కేటీఆర్ అటు టీఆర్ఎస్‌కు, ఇటు వైసీపీకి కూడా కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డిని టీఆర్ఎస్‌కు డమ్మీగా చేశారంటూ ఎద్దేవాచేశారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి […]

కేసీఆర్, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డ చంద్రబాబు
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 12:45 PM

Share

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. డేటా వార్ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు కేసీఆరేనని చంద్రబాబు అన్నారు. అలాగే కేటీఆర్ అటు టీఆర్ఎస్‌కు, ఇటు వైసీపీకి కూడా కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అన్నారు.

జగన్‌మోహన్ రెడ్డిని టీఆర్ఎస్‌కు డమ్మీగా చేశారంటూ ఎద్దేవాచేశారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషముంది. అందుకు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే రుజువని చంద్రబాబు అన్నారు. వైసీపీ కుతంత్రాలకు టీఆర్ఎస్, బీజేపీ సహకరిస్తున్నాయి. టీడీపీ డేటా చోరీ, ఓట్ల తొలగింపు అందులో భాగమే. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాయంటూ బాబు ధ్వజమెత్తారు.