AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్

గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఆయన తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. గతంలో ఆరుసార్లు గాంధీనగర్ నియోజకవర్గానికి పార్టీ వ్యవస్థాపక నేత లాల్ కృష్ణ అద్వాణీ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండడంతో అమిత్ షా బరిలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు […]

ఇవాళ గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2019 | 10:40 AM

Share

గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఆయన తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. గతంలో ఆరుసార్లు గాంధీనగర్ నియోజకవర్గానికి పార్టీ వ్యవస్థాపక నేత లాల్ కృష్ణ అద్వాణీ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండడంతో అమిత్ షా బరిలోకి దిగారు.

పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు శివసేన చీఫ్ ఉద్ధవ్, ఠాక్రే, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి నేత రామ్ విలాన్ పాశ్వాన్ తదితరులు పాల్గొంటున్నారు. నామినేషన్ దాఖలు చేయబోయే ముందు అమిత్.. స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.