AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పంచాయతీల ఏకగ్రీవాలపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం..

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలను మించిపోతున్నాయి. ముఖ్యంగా..

ఆ పంచాయతీల ఏకగ్రీవాలపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం..
K Sammaiah
|

Updated on: Feb 13, 2021 | 6:33 PM

Share

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలను మించిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య రోజురోజుకు పంచాయతీ ఎన్నికలు హీట్‌ పెంచుతున్నాయి. ఎన్నికల్లో ఏకగ్రీవాల పంచాయతీ తారా స్థాయికి చేరుకుంటుంది. ఏకగ్రీవాల్లో రాష్ట్ర హైకోర్టు కూడా కలగజేసుకునే స్థాయికి చేరుకుందంటే ఎన్నికలు ఏ లేవల్లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

వీలైనన్నీ పంచాయతీలను ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా కైవసం చేసుకోవాలని అధికార పార్టీ వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవంగా ఆ ఆపార్టీ కోటాలో చేరిపోయాయి ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

రెండోదశలో గుంటూరు జిల్లాలోని మాచర్ల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాల్లో అత్యధిక పంచాయతీల్లో ఏకగ్రీవాలయ్యాయి. వాటిపై విచారణ జరపాలని SECని హైకోర్ట్ ఆదేశించింది. అందుకు కూడా డెడ్‌లైన్‌ పెట్టింది న్యాయస్థానం. రేపటిలోగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణలో ఏం తేలబోతుందా అనే అంశం హాట్‌ టాపిక్‌గా మారిందిప్పుడు.

Read more:

ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పంచాయతీల్లో రీ ఎలక్షన్స్‌ నిర్వహించాలని కోరిన వర్ల, బోండా