
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సీఎం జగన్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ.. అగ్రిగోల్డ్ న్యాయం జరగని నేపథ్యంలో.. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరిపింది ఏపీ సర్కార్. 10 వేల లోపు ఉన్న డిపాజిటర్లకు మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేశారు. దీంతో.. మూడు లక్షల 69వేల మందికి 263,99,00,983 కోట్ల రూపాయలు పంపిణీ చేయనుంది వైసీపీ ప్రభుత్వం. కాగా.. కేవలం గుంటూరులోనే.. 19 వేల మంది వరకూ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. ఇక ఆ తర్వాతి దశలో రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల బాధను అర్థం చేసుకున్నా.. ఇక మీకు నేను వున్నాను అంటూ.. జగన్ అన్నారు. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ.. ఆటో కార్మికులను ఆదుకుంటుంన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
10వేల లోపు వారికి ఊరట..
పది వేల రూపాయలలోపు డిపాజిటర్లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతుంది వైసీపీ ప్రభుత్వం. జిల్లాల వారిగా బాధితులు.. వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే: