అవునా..? నేను షాక్ ఇస్తున్నా

| Edited By:

May 03, 2019 | 9:38 PM

పోలింగ్‌కు ఓ పది రోజుల ముందు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. కాషాయ పార్టీ ఆప్‌ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అంత సులభం కాదని కేజ్రీవాల్‌ ప్రకటించిన కొన్ని గంటలకే… ఆప్‌ ఎమ్మెల్యే ఒకరు బీజేపీలో చేరారు. గాంధీ నగర్‌ ఆప్‌ ఎమ్మెల్యే అనిల్‌ బాజ్‌పేయి పార్టీని వీడి.. కమలం గూటికి చేరారు. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో అనిల్‌ బాజ్‌పేయి కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడు లోక్‌సభ […]

అవునా..?  నేను షాక్ ఇస్తున్నా
Follow us on

పోలింగ్‌కు ఓ పది రోజుల ముందు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. కాషాయ పార్టీ ఆప్‌ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అంత సులభం కాదని కేజ్రీవాల్‌ ప్రకటించిన కొన్ని గంటలకే… ఆప్‌ ఎమ్మెల్యే ఒకరు బీజేపీలో చేరారు. గాంధీ నగర్‌ ఆప్‌ ఎమ్మెల్యే అనిల్‌ బాజ్‌పేయి పార్టీని వీడి.. కమలం గూటికి చేరారు. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో అనిల్‌ బాజ్‌పేయి కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడు లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్‌ ఎమ్మెల్యే బీజేపీలో చేరడం కేజ్రీవాల్‌కు తీవ్ర నష్టం కల్గిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.