
శీతాకాలం ప్రారంభమైంది. రాత్రి పూట, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తున్నాయి. సాధారణంగా శీతాకాలం ప్రారంభమైందంటే జలుబు, దగ్గుతో పాటు చేతులు, కాళ్ళు పొడిబారడం జరుగుతుంది.

వాతావరణ మార్పు ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మం పొడిబారుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.

ఓ గిన్నెలో రెండు స్పూన్ల మైదా తీసుకుని అందులో అర చెంచా పసుపు కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ తేనె, నెయ్యి కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ పెరుగు, పాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ను కూడా నివారిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

ఈ ప్యాక్ను అప్లై చేసిన తర్వాత 20-25 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి.

ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన టవల్తో శుభ్రం చేసుకుని, ముఖానికి నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. నైట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక స్పూన్ కొబ్బరి నూనె, గ్లిజరిన్, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి కలుపుకుంటే నైట్ క్రీమ్ రెడీ అయినట్లే. ఒక రోజు తయారు చేసి ఫ్రిజ్లో ఉంచితే 5 రోజుల వరకు దీనిని ఉపయోగించవచ్చు. ఈ నైట్ క్రీమ్ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా ముఖం సహజకాంతితో వెలిగిపోతుంది.