నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండు తినడం అస్సలు మంచిది కాదట.
ఒకవేళ పోనిలే పర్లేదు.. అని తింటే వారి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఎవరెవరు నారింజను తినకూడదు. ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నారింజ పండ్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నారింజ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆరెంజ్ తింటే.. వారి సమస్య ఇంకాస్త రెట్టింపు అవుతుంది. అలాగే నారింజ పండ్లు కొందరికి గుండెల్లో మంటను కలిగిస్తాయి.
జలుబు, దగ్గుతో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండాలట. నారింజలో ఆస్ట్రింజెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జలుబు, దగ్గుతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఎసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నారింజను తినకూడదు. ఎందుకంటే నారింజలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు నారింజ పండ్లను తింటే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు నొప్పికి దారి తీస్తుంది.
దంత సమస్యలతో బాధపడేవారు నారింజను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి. పంటి ఎనామెల్తో పాటు, కాల్షియం, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.