వర్షాకాలంలో పసుపు కలిపిన పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే !

Updated on: Jun 07, 2025 | 6:06 PM

వర్షాకాలం వచ్చిదంటే చాలు చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వైద్యులు మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. కాగా, వర్షాకాలంలో చాలా మంది పసుపు కలిపిన పాలు తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే దీని వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే మీకు మంచి నిద్ర పడుతుంది. శరీరానికి తగినంత ఉన్నప్పుడు బాడీ తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. దీంతో కండరాలు, ఎముకల నొప్పి, వాపు నుంచి రిలాక్స్ అవ్వొచ్చు. బ్రెయిన్ మరింత రిలాక్స్ అవుతుంది. దీంతో మీ జ్ఞాపశక్తి పెరుగుతుంది.

రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే మీకు మంచి నిద్ర పడుతుంది. శరీరానికి తగినంత ఉన్నప్పుడు బాడీ తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. దీంతో కండరాలు, ఎముకల నొప్పి, వాపు నుంచి రిలాక్స్ అవ్వొచ్చు. బ్రెయిన్ మరింత రిలాక్స్ అవుతుంది. దీంతో మీ జ్ఞాపశక్తి పెరుగుతుంది.

2 / 5
పసుపులో ఉండే కుర్క్యుమిన్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు పాలు తాగడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పాలల్లో పసుపు కలిపి తాగడం.. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మంచిది.రాత్రిపూట పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. పసుపు పాలు తాగడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పసుపులో ఉండే కుర్క్యుమిన్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు పాలు తాగడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పాలల్లో పసుపు కలిపి తాగడం.. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మంచిది.రాత్రిపూట పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. పసుపు పాలు తాగడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

3 / 5
ఆయుర్వేదం ప్రకారం ఈ పాలని రాత్రుళ్ళు తాగటం బెటర్ అంటారు. దీంతో శరీరానికి విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు. రాత్రుళ్లు పసుపు పాలు తాగటం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే ఉదయం తాగితే వేరే లాభాలు ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం ఈ పాలని రాత్రుళ్ళు తాగటం బెటర్ అంటారు. దీంతో శరీరానికి విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు. రాత్రుళ్లు పసుపు పాలు తాగటం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే ఉదయం తాగితే వేరే లాభాలు ఉంటాయి.

4 / 5
పసుపు పాలు ఉదయం తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ గోల్డెన్‌ మిల్క్‌ తాగటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలానే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

పసుపు పాలు ఉదయం తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ గోల్డెన్‌ మిల్క్‌ తాగటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలానే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

5 / 5
అదే విధంగా చాలా మంది మహిళలు పీరియడ్స్ పెయిన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు పసుపు కలిపిన పాలు తాగడం వలన ఇవి కడుపునొప్పి నుంచి రిలీఫ్‌ను ఇస్తాయంట. అలాగే అధిక రక్తస్రావం సమస్య నుంచి బయటపడేస్తుంది. అంతే కాకుండా శరీరంలో చెడు బ్యాక్టీరియాను కూడా బయటకు పంపేస్తుందంట.

అదే విధంగా చాలా మంది మహిళలు పీరియడ్స్ పెయిన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు పసుపు కలిపిన పాలు తాగడం వలన ఇవి కడుపునొప్పి నుంచి రిలీఫ్‌ను ఇస్తాయంట. అలాగే అధిక రక్తస్రావం సమస్య నుంచి బయటపడేస్తుంది. అంతే కాకుండా శరీరంలో చెడు బ్యాక్టీరియాను కూడా బయటకు పంపేస్తుందంట.