
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసుకొని మోటో జీ04ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్ను తీసుకొస్తున్నారు. గతేడాది తీసుకొచ్చిన మోటో జీ04 స్మార్ట్ ఫోన్కు అప్డేట్ వెర్షన్గా ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

మోటో జీ04ఎస్ స్మార్ట్ ఫోన్ గురువారం లాంచ్ అవుతుండగా జూన్ మొదటి వారం నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్ను విక్రయించనున్నారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్ను అందించారు. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్లో డాల్బీ ఆట్మోస్ సౌండ్ను అందించారు. 6.6 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను అంచారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ను ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్లో 500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు