- Telugu News Photo Gallery Technology photos 5 new smartphone launching on october 4th, Check here for features and price details
Smartphones: ఫోన్ కొనే ప్లాన్లో ఉన్నారా.? ఒక్కరోజే మార్కెట్లోకి 5 కొత్త స్మార్ట్ఫోన్లు వస్తున్నాయి..
పండుగల సీజన్ను క్యాష్ చేసుకోవడంలో మార్కెట్ ఎప్పుడు ముందుంటుంది. గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్పై భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి కంపెనీలు. ఈ క్రమంలోనే కొన్ని స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలు ఈ పండుగ సీజన్లో కొత్త ఫోన్స్ను లాంచ్ చేస్తున్నాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ ప్రారంభమవుతోన్న తరుణంలో అక్టోబర్4వ తేదీన ఒక్క రోజే మార్కెట్లోకి 5 కొత్త ఫోన్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆ ఫోన్లు ఏంటి.? వాటి ఫీచర్స్ ఏంటి.? ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 03, 2023 | 4:54 PM

గూగుల్ పిక్సెల్ 8: ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్లు కూడా అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కానున్నాయి. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.70 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను ఇవ్వనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీల కోసం 11 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో 4950 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ రూ. 58 వేల వరకు ఉండొచ్చని అంచనా.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో: ఇక గూగుల్ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఈ ఫోన్లో 6.7 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను ఇవ్వనున్నారు. గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే 11 ఎంపీ కెమెరాతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ: అక్టోబర్ 4వ తేదీన అందుబాటులోకి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 12 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

వివో వీ29: అక్టోబర్ 4వ తేదీన మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్స్లో వీవో వీ29 ఒకటి. 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 40వేలలోపు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్లో 6.78 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇవ్వనున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్తో ఈ ఫోన్ రానుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

వివో వీ29 ప్రో: వివో వీ29 స్మార్ట్ ఫోన్కు అప్గ్రేడ్ వెర్షన్ అయిన వివో వీ29ప్రో ఫోన్ను కూడా బుధవారం మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ. 44 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఫోన్లో 6.7 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇవ్వనున్నారు. మీడియా డైమెన్సిటీ ప్రాససర్తో పనిచేసేఈ ఫోన్లో 256 స్టోరేజ్ కెపాసిటీని అందించారు.





























