
ముందుగా దొండకాయలను తీసుకుని బాగా క్లీన్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నె లోకి తీసుకోవాలి. వీటిని ఫ్యాన్ కింద ఎక్కువ సేపు ఆరబెడితే పెరుగు పచ్చడి టేస్టీగా ఉంటుంది. కాబట్టి, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి.

ఇప్పుడు గ్యాస్ పొయ్యి పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి అది కాగిన తర్వాత దొండకాయ ముక్కలను వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే పెట్టి బాగా వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

నాలుగు కప్పులు పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మజ్జిగలా చేసుకోవాలి, దానిలో మిక్సీలో పట్టిన మసాలా పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఈ పెరుగును తీసుకుని దొండకాయలున్న పెనంలో పోసి మీడియం మంట పై తక్కువ ఫ్లేమ్ తో పది నిముషాలు పాటు స్టవ్ మీదే ఉడికించి ముక్కలకు పెరుగు పట్టే వరకు అలాగే వేయించండి.

తాలింపు పెట్టుకోవాలి: చివర్లో కొద్దిగా 5 ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా ఇంగువ, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించి ఈ మిశ్రమాన్ని దొండకాయ పెరుగు పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ అదిరిపోతోంది. వేసవి కాలంలో అయితే ఇది సూపర్ అండ్ బెస్ట్ రెసిపీ.