
లగ్జరీ క్రూయిజ్ బోట్ లలో పాపికొండల సుందరమైన అందాలను వీక్షించే అవకాశాన్ని ఏపీ టూరిజం వారు కల్పిస్తున్నారు. పాపి కొండలు తూర్పు కనుమలలో ఉన్న ఒక సుందరమైన కొండల ప్రదేశం. ఈ ప్రాంతం వలస వచ్చే అరుదైన పక్షులతో సహా అనేక రకాల వృక్షాలు, జంతువులకు నిలయంగా ఉంది. ఇక్కడే పోలవరం ప్రాజెక్టుకూడా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఈ కొండలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి.

బంగీ జంపింగ్, రివర్ రాఫ్టింగ్: రిషికేశ్, గంగా నది ఒడ్డున ఉన్న నగరం. అనేక సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ నుండి బంగీ జంపింగ్ వరకు అనేక కార్యకలాపాలు చేయవచ్చు. ప్రతి వారాంతంలో భారీగా జనం ఇక్కడకు చేరుకుంటారు. బంగీ జంపింగ్ కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది దేశంలోనే ఎత్తైన ప్లాట్ఫారమ్.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్: ఏనుగుపై కూర్చొని ఉత్తరాఖండ్ అడవులను సందర్శించాలనుకుంటే మీరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని సందర్శించాలని ప్లాన్ చేసుకోండి. ఈ ప్రదేశం అడవిని అన్వేషించడానికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది, "మ్యాన్ వర్సెస్ వైల్డ్" బేర్ గ్రిల్స్తో పాటు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ పార్క్ ను సందర్శించారు. సాహసం ఇష్టమైతే ఇక్కడ జీప్ సఫారీ, ఏనుగు సఫారీ చేయవచ్చు. ఇక్కడ మీరు కింగ్ కోబ్రాను చూసే అవకాశం కూడా ఉంది. రంగురంగుల పక్షులను ఇష్టపడేవారు పక్షులను వీక్షించడానికి ఇక్కడకు చేరుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇక్కడ చేపలు పట్టవచ్చు.

పంగోట్లో క్యాంపింగ్: నైనిటాల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. నైనిటాల్ జనసమూహం నుంచి దూరంగా కొన్ని క్షణాలు ప్రశాంతంగా గడపడానికి ఈ గ్రామానికి వెళ్ళవచ్చు. గ్రామం వైపు వెళుతున్నప్పుడు మంచు శిఖరం, నైనా శిఖరం వంటి అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. పక్షి ప్రేమికులకు ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువ కాదు. ఇక్కడ మీరు 150 కంటే ఎక్కువ జాతుల పక్షులను చూడవచ్చు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 6300 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్, పర్వత బైకింగ్, పక్షులను చూడటం, క్యాంపింగ్ వంటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

ఆలి రోప్ వే , స్కీయింగ్: ఔలి అనేది సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందిన చమోలి పర్యాటక ప్రదేశం. ఔలిలోని అందమైన లోయల కారణంగా దీనిని స్విట్జర్లాండ్తో కూడా పోలుస్తారు. స్కీయింగ్ ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన సాహస క్రీడ. హిమపాతం, స్కీయింగ్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఔలికి వెళ్లాల్సిందే. ఇది ప్రపంచ ప్రసిద్ధ స్కీయింగ్ గమ్యస్థానం. శీతాకాలంలో పర్యాటకులతో రద్దీగా ఉంటుంది.

ముక్తేశ్వర్లో రాక్ క్లైంబింగ్: నైనిటాల్ జిల్లాలో 2286 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ ప్రాంతం. ఈ ప్రదేశం రాక్ క్లైంబింగ్, రాపెల్లింగ్కు ప్రసిద్ధి చెందింది. ఈ సాహసం కోసం ఈ సీజన్ ఉత్తమంగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి పొరపాటున కూడా ప్లాన్ చేసుకోకండి. సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందడమే కాకుండా, ఇక్కడ పురాతన ఆలయం కూడా ఉంది. ఇక్కడ కొండల నుండి అందమైన సూర్యోదయాన్ని చూడటానికి, పర్యాటకులు రాత్రిపూట ఇక్కడ విడిది చేస్తారు.