
వరలక్ష్మీ వ్రతం రోజూ అస్సలే ఎడమ చేతితో తాంబూలం ఇవ్వకూడదు. ఎడమ చేతితో తాంబూలం ఇవ్వడం చాలా అశుభకరం. ఇలా ఇవ్వడం వలన తాంబూలం ఇచ్చిన వారికి కూడా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు, తీసుకున్న వారికి ఎలాంటి ఫలితం ఉండదు అని చెబుతున్నారు పండితులు.

తాంబూలం ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని వస్తువులు ఉండాలి. తమలపాకులు, పసుపు , కుంకుమ, చిన్న కాయిన్, పువ్వు, గాజులు, పండ్లు పెట్టి ఇవ్వాలంట. కానీ కొందరు తెలియక ఆకులు కొబ్బరికాయ మాత్రమే ఇస్తారు అలా ఇవ్వకూడదు.

అంతే కాకుండా ఎప్పుడూ తాంబూలం ఇచ్చినా, మూడు కళ్లున్న కొబ్బరి తమ వద్ద ఉంచుకొని నార్మల్ది ఇతరులకు ఇవ్వాలి. అంతే కాకుండా అరటి పండును తమలపాకులపై పెట్టి, కొన మీ వైపుకు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు ఇచ్చిన తాంబూలానికి తగిన ఫలితం ఉంటుంది.

అలాగే చెరిగిన ఆకులు, పాడైన వక్కా, వంటి వాటిని తాంబూలంగా ఇవ్వకూడదు. దీని వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇలా తాంబూలం ఇవ్వడం వలన సమస్యలు ఎదురు అవుతాయి. అంతే కాకుండా కోపంగా చిరాకుగా కూడా తాంబూలం ఇవ్వకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా తాంబూలం ఇవ్వాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు