Yellakonda Shiva Temple: తెలంగాణ శ్రీశైలంగా ఖ్యాతిగాంచిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా..

Updated on: Aug 12, 2021 | 12:07 PM

Yellakonda Shiva Temple: భారత దేశం ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ గుడులు గోపురాలకు కొదువ లేదు. స్వయం భూ దేవాలయాలతో పాటు.. రాజ వంశీకుల కాలాల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో ఒకటి కాకతీయ కాలం నాటి శివాలయం వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం యెల్లకొండ గ్రామంలో ఉంది.

1 / 5
కాకతీయుల కాలంలో నిర్మింపబడిన ఎల్లకొండ శివాలయం.. తెలంగాణా శ్రీశైలంగా ప్రసిద్ధి. ఈ శివాలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం లో నిర్మించిన అనేక శివాలయాల్లో ఇది ఒకటి.. ఈ ఆలయ నిర్మాణం కూడా రామప్ప దేవాలయం శైలిలో ఉండి ఎంతో అందంగా, మనసుని ఆకట్టుకుంటుంది.

కాకతీయుల కాలంలో నిర్మింపబడిన ఎల్లకొండ శివాలయం.. తెలంగాణా శ్రీశైలంగా ప్రసిద్ధి. ఈ శివాలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం లో నిర్మించిన అనేక శివాలయాల్లో ఇది ఒకటి.. ఈ ఆలయ నిర్మాణం కూడా రామప్ప దేవాలయం శైలిలో ఉండి ఎంతో అందంగా, మనసుని ఆకట్టుకుంటుంది.

2 / 5
పూర్వం ఒక ముని కొండపై తపస్సు చేస్తున్న సమయం లో ఆకాశయానం  చేస్తున్న శివపార్వతులు ఆ ముని తపస్సుకి పరవశించి  కొండపైన దిగి దర్శనం ఇచ్చినట్లు పురాణాల కథనం.. అందుకనే ఈ కొండ వెండి కొండగా ప్రసిద్ది చెందింది.. కాలక్రమేణా ఎల్లకొండగా మారింది అని స్థానికుల కథనం

పూర్వం ఒక ముని కొండపై తపస్సు చేస్తున్న సమయం లో ఆకాశయానం చేస్తున్న శివపార్వతులు ఆ ముని తపస్సుకి పరవశించి కొండపైన దిగి దర్శనం ఇచ్చినట్లు పురాణాల కథనం.. అందుకనే ఈ కొండ వెండి కొండగా ప్రసిద్ది చెందింది.. కాలక్రమేణా ఎల్లకొండగా మారింది అని స్థానికుల కథనం

3 / 5
కొండ పైన శివాలయం, కొండకు దిగువ భాగాన శంబుని ఆలయం ఉంది. ఆలయ మండపం దీర్ఘచతురస్రాకారంలో నిర్మించబడింది. ఇక మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి. ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది.

కొండ పైన శివాలయం, కొండకు దిగువ భాగాన శంబుని ఆలయం ఉంది. ఆలయ మండపం దీర్ఘచతురస్రాకారంలో నిర్మించబడింది. ఇక మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి. ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది.

4 / 5
ఆలయ నిర్మాణాన్ని బట్టి చుస్తే  కాకతీయుల కాలం  లో నిర్మించారు అని పురావస్తు శాఖవారి అభిప్రాయం. శివాలయం మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి. ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆలయ నిర్మాణాన్ని బట్టి చుస్తే కాకతీయుల కాలం లో నిర్మించారు అని పురావస్తు శాఖవారి అభిప్రాయం. శివాలయం మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి. ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది.

5 / 5
ఎల్లకొండ గ్రామం హైదరాబాద్ జిల్లా కేంద్రం నుండి శంకర్‌పల్లి రోడ్డు మీదుగా దాదాపు 57 కిమీ దూరంలో ఉంది. వికారాబాద్ నుంచి బస్సు సర్వీస్ లు ఈ  గ్రామానికి ఉంటాయి

ఎల్లకొండ గ్రామం హైదరాబాద్ జిల్లా కేంద్రం నుండి శంకర్‌పల్లి రోడ్డు మీదుగా దాదాపు 57 కిమీ దూరంలో ఉంది. వికారాబాద్ నుంచి బస్సు సర్వీస్ లు ఈ గ్రామానికి ఉంటాయి

Follow Us