AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanavami 2022: శ్రీరామనవమి రోజున ఈ ప్రసిద్ధ ఆలయాలను తప్పక సందర్శించండి.. ఎక్కడెక్కడున్నాయంటే..

శ్రీరామనవమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలి.

Rajitha Chanti
|

Updated on: Apr 10, 2022 | 12:29 PM

Share
 దేశంలో రాముడికి అంకితం చేయబడిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.  రామ నవమి ప్రత్యేక రోజూన ఈ ఆలయాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దర్శనం కోసం ఏ ప్రసిద్ధ రాముడి ఆలయానికి వెళ్లవచ్చో తెలుసుకుందాం.

దేశంలో రాముడికి అంకితం చేయబడిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. రామ నవమి ప్రత్యేక రోజూన ఈ ఆలయాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. శ్రీరాముని దర్శనం కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దర్శనం కోసం ఏ ప్రసిద్ధ రాముడి ఆలయానికి వెళ్లవచ్చో తెలుసుకుందాం.

1 / 5
రామ్ రాజా ఆలయం.. మధ్యప్రదేశ్ - రామ్ రాజా ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. ఈ ఆలయంలో, శ్రీరాముడు దేవుడిగా,రాజుగా పూజించబడతాడు. ఈ ఆలయం కోట రూపంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు ఒక గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. ఈ ఆలయంలో ప్రతిరోజూ రాజా రాముడికి సాయుధ వందనం సమర్పించబడుతుంది. ఇది ఈ ఆలయానికి సంబంధించిన సంప్రదాయం  మరింత ప్రత్యేకమైనది.

రామ్ రాజా ఆలయం.. మధ్యప్రదేశ్ - రామ్ రాజా ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. ఈ ఆలయంలో, శ్రీరాముడు దేవుడిగా,రాజుగా పూజించబడతాడు. ఈ ఆలయం కోట రూపంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు ఒక గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. ఈ ఆలయంలో ప్రతిరోజూ రాజా రాముడికి సాయుధ వందనం సమర్పించబడుతుంది. ఇది ఈ ఆలయానికి సంబంధించిన సంప్రదాయం మరింత ప్రత్యేకమైనది.

2 / 5
కాలరామ్ ఆలయం, నాసిక్ - మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో కలారామ్ ఆలయం ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత అందమైన రామాలయాల్లో ఒకటి. ఇందులో 2 అడుగుల ఎత్తైన నల్లని రాముడి విగ్రహం ఉంది. రాముడితో పాటు సీతా, లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి. 14 సంవత్సరాల వనవాసంలో, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు 10వ సంవత్సరం తర్వాత గోదావరి నది ఒడ్డున నివసించడానికి పంచవటికి వచ్చారని నమ్ముతారు.

కాలరామ్ ఆలయం, నాసిక్ - మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో కలారామ్ ఆలయం ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత అందమైన రామాలయాల్లో ఒకటి. ఇందులో 2 అడుగుల ఎత్తైన నల్లని రాముడి విగ్రహం ఉంది. రాముడితో పాటు సీతా, లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి. 14 సంవత్సరాల వనవాసంలో, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు 10వ సంవత్సరం తర్వాత గోదావరి నది ఒడ్డున నివసించడానికి పంచవటికి వచ్చారని నమ్ముతారు.

3 / 5
అయోధ్య రామమందిరం. ఉత్తరప్రదేశ్ - ఈ ఆలయాన్ని శ్రీరాముని జన్మస్థలంగా పిలుస్తారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదికి కుడివైపున ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

అయోధ్య రామమందిరం. ఉత్తరప్రదేశ్ - ఈ ఆలయాన్ని శ్రీరాముని జన్మస్థలంగా పిలుస్తారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదికి కుడివైపున ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

4 / 5
రఘునాథ్ ఆలయం, జమ్మూ - ఈ ఆలయం ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం జమ్మూ మధ్యలో ఉంది. రఘునాథ్ ఆలయం రాముడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో భక్తులు 33 కోట్ల దేవతలను కూడా దర్శించుకోవచ్చు. రఘునాథ్ ఆలయ సముదాయంలో మరో 7 ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది.

రఘునాథ్ ఆలయం, జమ్మూ - ఈ ఆలయం ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం జమ్మూ మధ్యలో ఉంది. రఘునాథ్ ఆలయం రాముడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో భక్తులు 33 కోట్ల దేవతలను కూడా దర్శించుకోవచ్చు. రఘునాథ్ ఆలయ సముదాయంలో మరో 7 ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది.

5 / 5