Vinayaka Chavithi: వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు.. ఎలా చేయాలంటే.?

|

Sep 03, 2024 | 2:05 PM

వినాయక చవితి అంటే మొదటిగా గుర్తివచ్చేవి బారి గణనాధుని విగ్రహాలు, అంబరానంటే సంబరాలు.  వీటి తర్వాత అత్యంత ముఖ్యమైనవి  బొజ్జగణపయ్య గణపయ్య పెట్టిన ప్రసాదాలే. లంబోదరుడు భోజనప్రియుడు.. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలు తయారు చేసి.. అందిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాడు. మరి గణపతికి ఇష్టమైన ప్రసాదాలేంటో.. వాటిని ఎలా తయారు చేయాలో చేసేద్దాం రండి..

1 / 6
గణనాధునికి  అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పాల ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు బియ్యపు పిండి : కప్పున్నర, పాలు : 2 1/2 కప్పులు, చక్కెర : 100 గ్రా, యాలకుల పొడి : చిటికెడు, సాబుదానా(సగ్గుబియ్యం) : 3 టేబుల్‌ స్పూన్స్‌, నూనె : పావు టీస్పూన్‌. ఒక గిన్నెలో తగినన్ని(ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు)నీళ్లు, నూనె పోసి మరిగించాలి. అందులో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలిపి కొద్దిగా చేతులకు నూనె  రాసుకొని పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టిన  ఉండలను ఆవిరి మీద వీటిని ఉడికించిన తర్వాత ఈ లోపు గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తర్వాత పాలల్లో సాబుదానా  ఓ పావుగంట నానబెట్టుకోని చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఉడికించిన ఉండ్రాళ్లను వేసి సన్నని మంట మీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.

గణనాధునికి  అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పాల ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు బియ్యపు పిండి : కప్పున్నర, పాలు : 2 1/2 కప్పులు, చక్కెర : 100 గ్రా, యాలకుల పొడి : చిటికెడు, సాబుదానా(సగ్గుబియ్యం) : 3 టేబుల్‌ స్పూన్స్‌, నూనె : పావు టీస్పూన్‌. ఒక గిన్నెలో తగినన్ని(ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు)నీళ్లు, నూనె పోసి మరిగించాలి. అందులో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలిపి కొద్దిగా చేతులకు నూనె  రాసుకొని పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టిన  ఉండలను ఆవిరి మీద వీటిని ఉడికించిన తర్వాత ఈ లోపు గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తర్వాత పాలల్లో సాబుదానా  ఓ పావుగంట నానబెట్టుకోని చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఉడికించిన ఉండ్రాళ్లను వేసి సన్నని మంట మీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.

2 / 6
గణేశునికి ఇష్టమైన చింతపండు పులిహోరకి కావాల్సినవి : బియ్యం : ఒక కప్పు, చింతపండు: కొద్దిగా, పసుపు : ఒక టేబుల్‌ స్పూన్‌, పల్లీలు : 3 టేబుల్‌ స్పూన్స్‌, ఆవాలు : ఒక టీ స్పూన్‌, శెనగపప్పు : ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర : ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండు మిరపకాయలు : 4, నూనె, ఉప్పు : తగినంత, పచ్చిమిర్చి-4, మిరియాలు- ఒక టేబుల్​ స్పూన్​ కరివేపాకు-తగినంత. మొదటిగా చింతపండును వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. తర్వాత బియ్యాన్ని కడిగి కాసేపు నానబెట్టిన తర్వాత అన్నం కొంచెం పొడిపొడిగా వండాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో  చింతపండు రసం, కొన్ని నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోసి.. చిక్కగా ఉడికించాలి.  ఈలోపు కడాయిలో నూనె పోసి ఆవాలు, శెనగపప్పును వేయించి ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ప్లేట్​లోకి తీసుకోవాలి. తర్వాత పులిహోర కలపడానికి వీలుగా ఉండే  ప్లేట్​ తీసుకుని అందులో ఉడికించిన అన్నం, కొద్దిగా నూనె, కొంచెం పసుపు వేసి కలుపుకోన్న తర్వాత దానిలో ఉడికించిన చింతపండు రసం, ఉప్పు తగినంత వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత అంతకుముందు నూనెలో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి బాగా కలపాలి.

గణేశునికి ఇష్టమైన చింతపండు పులిహోరకి కావాల్సినవి : బియ్యం : ఒక కప్పు, చింతపండు: కొద్దిగా, పసుపు : ఒక టేబుల్‌ స్పూన్‌, పల్లీలు : 3 టేబుల్‌ స్పూన్స్‌, ఆవాలు : ఒక టీ స్పూన్‌, శెనగపప్పు : ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర : ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండు మిరపకాయలు : 4, నూనె, ఉప్పు : తగినంత, పచ్చిమిర్చి-4, మిరియాలు- ఒక టేబుల్​ స్పూన్​ కరివేపాకు-తగినంత. మొదటిగా చింతపండును వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. తర్వాత బియ్యాన్ని కడిగి కాసేపు నానబెట్టిన తర్వాత అన్నం కొంచెం పొడిపొడిగా వండాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో  చింతపండు రసం, కొన్ని నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోసి.. చిక్కగా ఉడికించాలి.  ఈలోపు కడాయిలో నూనె పోసి ఆవాలు, శెనగపప్పును వేయించి ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ప్లేట్​లోకి తీసుకోవాలి. తర్వాత పులిహోర కలపడానికి వీలుగా ఉండే  ప్లేట్​ తీసుకుని అందులో ఉడికించిన అన్నం, కొద్దిగా నూనె, కొంచెం పసుపు వేసి కలుపుకోన్న తర్వాత దానిలో ఉడికించిన చింతపండు రసం, ఉప్పు తగినంత వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత అంతకుముందు నూనెలో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి బాగా కలపాలి.

3 / 6
మోదక్‌ కూడా పెట్టవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు : బియ్యపు పిండి : ఒక కప్పు, నెయ్యి : 3 టీస్పూన్స్‌, బెల్లం తురుము : ఒక కప్పు, కొబ్బరి తురుము : 2 కప్పులు, యాలకులు : 3,ఉప్పు : చిటికెడు. ముందుగా కడాయిలో నెయ్యి, బెల్లం, కొబ్బరి తురుము వేసి కాలుతూ అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి అందులో యాలకులు వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి దానిలో ఉప్పు, నెయ్యి వేసి కాసేపు ఉంచి దించి చల్లారక ముందే బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా పూరీ పిండిలా కలుపుకోని దీన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని చిన్న దొప్పలా చేసుకోని దీంట్లో బెల్లం మిశ్రమాన్ని ఉంచి మళ్లీ బంతిలా లేదా మనకు నచ్చిన రీతిలో ముడుచుకోవచ్చు. తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గుడ్డ వేసి సిద్ధం చేసిన మోదక్​లను సుమారు పది నిమిషాల పాటు ఆవిరి ఉడికించి గణపయ్యకు నైవేద్యంగా పెట్టాలి.

మోదక్‌ కూడా పెట్టవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు : బియ్యపు పిండి : ఒక కప్పు, నెయ్యి : 3 టీస్పూన్స్‌, బెల్లం తురుము : ఒక కప్పు, కొబ్బరి తురుము : 2 కప్పులు, యాలకులు : 3,ఉప్పు : చిటికెడు. ముందుగా కడాయిలో నెయ్యి, బెల్లం, కొబ్బరి తురుము వేసి కాలుతూ అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి అందులో యాలకులు వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి దానిలో ఉప్పు, నెయ్యి వేసి కాసేపు ఉంచి దించి చల్లారక ముందే బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా పూరీ పిండిలా కలుపుకోని దీన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని చిన్న దొప్పలా చేసుకోని దీంట్లో బెల్లం మిశ్రమాన్ని ఉంచి మళ్లీ బంతిలా లేదా మనకు నచ్చిన రీతిలో ముడుచుకోవచ్చు. తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గుడ్డ వేసి సిద్ధం చేసిన మోదక్​లను సుమారు పది నిమిషాల పాటు ఆవిరి ఉడికించి గణపయ్యకు నైవేద్యంగా పెట్టాలి.

4 / 6
 రవ్వలడ్డుకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ : ఒక కప్పు, చక్కెర : ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి : అర కప్పు, పాలు : పావు కప్పు, యాలకులు : 4, నెయ్యి : 3 టేబుల్‌ స్పూన్స్‌, జీడిపప్పు : 10, కిస్మిస్‌ : 10. చక్కెర, యాలకులను మిక్సీలో వేసి మెత్తటి పొడిగా గ్రైండ్‌ చేసుకోని పక్కన పెట్టాలి.తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్‌, జీడిపప్పులను గోల్డెన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోని ఓ ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి. అదే బాండీలో మిగతా నెయ్యి వేసి స్లిమ్​లో రవ్వ రవ్వ రంగు మారే వరకు వేయించుకోవాలి.  తర్వాత పక్కన పెట్టిన చక్కెర, యాలకుల పొడి, వేయించుకున్న కిస్మిస్​, జీడిపప్పులను వేసి బాగా కలిపి చివరగా పాలు వేసి మరికొద్దిసేపు కలుపుకోని స్టౌ మీది నుంచి దించి వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవాలి. చల్లగా అయితే లడ్డూలు చేయడం కష్టం.

రవ్వలడ్డుకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ : ఒక కప్పు, చక్కెర : ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి : అర కప్పు, పాలు : పావు కప్పు, యాలకులు : 4, నెయ్యి : 3 టేబుల్‌ స్పూన్స్‌, జీడిపప్పు : 10, కిస్మిస్‌ : 10. చక్కెర, యాలకులను మిక్సీలో వేసి మెత్తటి పొడిగా గ్రైండ్‌ చేసుకోని పక్కన పెట్టాలి.తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్‌, జీడిపప్పులను గోల్డెన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోని ఓ ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి. అదే బాండీలో మిగతా నెయ్యి వేసి స్లిమ్​లో రవ్వ రవ్వ రంగు మారే వరకు వేయించుకోవాలి.  తర్వాత పక్కన పెట్టిన చక్కెర, యాలకుల పొడి, వేయించుకున్న కిస్మిస్​, జీడిపప్పులను వేసి బాగా కలిపి చివరగా పాలు వేసి మరికొద్దిసేపు కలుపుకోని స్టౌ మీది నుంచి దించి వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవాలి. చల్లగా అయితే లడ్డూలు చేయడం కష్టం.

5 / 6
 స్వీట్‌ పొంగల్‌కి కావాల్సిన పదార్థాలు బియ్యం : అర కప్పు, పెసరపప్పు: అర కప్పు, బెల్లం తురుము : అర కప్పు, యాలకుల పొడి : చిటికెడు, పచ్చ కర్పూరం : చిన్నది, నెయ్యి : 3 టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు : 12, కిస్మిస్‌ : 12, లవంగాలు : 2, ఎండు కొబ్బరి ముక్కలు : 2 టేబుల్‌ స్పూన్స్‌. కుక్కర్‌లో పెసరపప్పు వేయించుకొని ఇందులోనే బియ్యం పోసి కలిపి బాగా కలిపి, నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి సన్నని మంటమీద చిక్కగా పాకంలా చేసుకొని పక్కన ఉంచాలి. ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం, పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా పప్పు గుత్తితో మెదిపి బెల్లం పాకం, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద రెండు నిమిషాలు ఉంచాన తర్వాత నెయ్యి వేసి కలపాలి. ఇది అయ్యేలోపు.. చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌, లవంగాలు, కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటన్నింటిని ఉడుకుతున్న పొంగల్‌లో వేసి రెండు నిమిషాలు ఉంచి దించేస్తే సరి. దించేముందు పచ్చ కర్పూరం వేసి కలపాలి.

స్వీట్‌ పొంగల్‌కి కావాల్సిన పదార్థాలు బియ్యం : అర కప్పు, పెసరపప్పు: అర కప్పు, బెల్లం తురుము : అర కప్పు, యాలకుల పొడి : చిటికెడు, పచ్చ కర్పూరం : చిన్నది, నెయ్యి : 3 టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు : 12, కిస్మిస్‌ : 12, లవంగాలు : 2, ఎండు కొబ్బరి ముక్కలు : 2 టేబుల్‌ స్పూన్స్‌. కుక్కర్‌లో పెసరపప్పు వేయించుకొని ఇందులోనే బియ్యం పోసి కలిపి బాగా కలిపి, నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి సన్నని మంటమీద చిక్కగా పాకంలా చేసుకొని పక్కన ఉంచాలి. ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం, పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా పప్పు గుత్తితో మెదిపి బెల్లం పాకం, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద రెండు నిమిషాలు ఉంచాన తర్వాత నెయ్యి వేసి కలపాలి. ఇది అయ్యేలోపు.. చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌, లవంగాలు, కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటన్నింటిని ఉడుకుతున్న పొంగల్‌లో వేసి రెండు నిమిషాలు ఉంచి దించేస్తే సరి. దించేముందు పచ్చ కర్పూరం వేసి కలపాలి.

6 / 6
బొంబాయి రవ్వ : ఒక కప్పు, చక్కెర : 3/4 కప్పు, యాలకులు : 3, నెయ్యి : 5 టేబుల్‌స్పూన్స్‌, నూనె : తగినంత రవ్వ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు.. కొద్దిగా నెయ్యి వేసి రెండు నిమిషాల తర్వాత రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలిపి సన్నని మంటమీద 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి దించేయాలి. కాస్త చల్లారనిచ్చి చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి. కలిపినప్పుడు తప్ప.. మిగతా సమయంలో మూత పెట్టే ఉంచి ఐదు నిమిషాలు తర్వాత దించేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న ఉండలుగా చేసి చేతికి నెయ్యి రాసుకొని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం చేయాలి. ఆ తర్వాత బాండీలో నూనె పోసి అప్పాలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

బొంబాయి రవ్వ : ఒక కప్పు, చక్కెర : 3/4 కప్పు, యాలకులు : 3, నెయ్యి : 5 టేబుల్‌స్పూన్స్‌, నూనె : తగినంత రవ్వ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు.. కొద్దిగా నెయ్యి వేసి రెండు నిమిషాల తర్వాత రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలిపి సన్నని మంటమీద 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి దించేయాలి. కాస్త చల్లారనిచ్చి చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి. కలిపినప్పుడు తప్ప.. మిగతా సమయంలో మూత పెట్టే ఉంచి ఐదు నిమిషాలు తర్వాత దించేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న ఉండలుగా చేసి చేతికి నెయ్యి రాసుకొని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం చేయాలి. ఆ తర్వాత బాండీలో నూనె పోసి అప్పాలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.