Ayodhya: బేకరీ షాప్లో అయోధ్య రామ మందిర తరహా కేక్.. సెల్ఫీలు దిగుతూ భక్తుల సందడి..
కొన్ని వందల ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నం అవుతోంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు తన జన్మ భూమి అయోధ్యలో కొలువు దీరే శుభ తరుణం రానే వచ్చేసింది. రామ మందిరంలోని గర్భ గుడిలో ఈ నెల 22వ తేదీన బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లో రామ నామ స్మరణతో మారు మ్రోగిపోతోంది. భారీ సంఖ్యలో అయోధ్యకు పయనం అవుతుంటే.. మరికొందరు రామయ్యపై తమ భక్తిని వివిధ రకాలుగా వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ బేకరీ షాప్ యజమాని రామ మందిరం తరహాలో కేక్ ని తయారు చేశాడు.
Most Read Stories