
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో బొప్పాయి పండులో అరుదైన వింత ఆకారం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే బట్టల వ్యాపారి తినేందుకు కోనుగోలు చేసిన బోప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య ప్రత్యక్షం అయింది.

గంగాధర్ బోప్పాయి పండులోని గణపతిని చూసి అవాకై దైవంగా కొలిచి దండం పెట్టాడు.

సాక్షాత్తు వినాయకుడే ఈ రూపంలో ప్రత్యక్షమై మా షాపుకి వచ్చాడని భావించి షాప్ లో ఉన్న దేవుళ్ళ చిత్రపటాల వద్ద పెట్టి పూజలు చేస్తూన్నాడు బట్టలవ్యాపారి గంగాధర్.

ఈవార్త ఆనోటా ఈ నోటా పాకడంతో..బొప్పాయి లో బొజ్జ గణపయ్యను చూసెందుకు మహిళలు తరలి వస్తున్నారు.

ఆ గణనాథుడు ఈవిధంగా ప్రత్యక్షమవ్వటం చాలా ఆనందంగా ఉందని గంగాధర్ చేపుతున్నాడు.