
శ్రావణ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. శ్రీమహావిష్ణువుకు, శ్రీమహాలక్ష్మికి, పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణమాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను కలుగుతాయని విశ్వాసం. అందుకనే ఈ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు.

శ్రావణ మాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వివిధ ఆచారాలు, పండుగలు లక్ష్మీ దేవికి అంకితం చేయబడతాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో తామర పువ్వులు, స్వస్తికలు, రేఖాగణిత నమూనాలు వంటి శుభ చిహ్నాలను కలిగి ఉన్న రంగోలి డిజైన్లుతో ఇంట్లోకి లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది.

శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం లేదా పూర్ణిమ (పౌర్ణమి) ముందు శుక్రవారం జరిగే ఈ పండుగ ప్రత్యేకంగా లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు ఇంటిముందు ముగ్గులు వేయడం శ్రేయస్సు, శుభం, ఇంటికి సానుకూల శక్తిని స్వాగతించడాన్ని సూచిస్తాయి.

సహజ రంగులు, పువ్వుల రేకులు, కొవ్వొత్తులు, దీపాలు వంటి ఇతర అలంకార అంశాలను ఉపయోగించి ముగ్గులు వేయవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఇలా ముగ్గులు ముగ్గులు వేస్తే ఆర్థికంగా బలపడతారని హిందువులు నమ్ముతారు.

రంగోలితో పాటు, శ్రావణ మాసంలో లక్ష్మి పాదముద్రలుతో ఇంటి ప్రవేశ ద్వారన్ని అలంకరించడం, పూజ చేయడం వంటి ఇతర పద్ధతులతో కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ మాసంలో ఇంటి ముందు స్థలాన్ని శుభ్రపరచి, శుద్ధి చేసి లక్ష్మీ దేవిని స్వాగతించేలా ముగ్గులు వెయ్యడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.