
కనక్ భవన్ ఆలయం: సీతారాములకు అంకితం చేయబడిన ఈ ఆలయం బంగారు స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ రాజభవనాన్ని రాముడు సీతతో వివాహం చేసుకున్న తర్వాత కైకేయి బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు.

సీతా కి రసోయి: అయోధ్యలో ఉన్న సీతా కి రసోయి, రాముడి భార్య సీత వంటగదిగా విశ్వసించబడే పవిత్ర స్థలం. హిందూ పురాణాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. అయోధ్య వెళ్తే ఇక్కడికి తప్పక వెళ్ళండి.

త్రేతా కే ఠాకూర్: రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన ఆలయం. ఇది అయోధ్యలోని నయా ఘాట్ వద్ద ఉంది. ఇది ఉత్తర భారత నగర నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఇందులో సాంప్రదాయ "శిఖరాలు" కూడా ఉన్నాయి.

నాగేశ్వరనాథ్ ఆలయాన్ని రాముడి కుమారుడు కుశుడు స్థాపించాడని చెబుతారు. పురాణాల ప్రకారం, కుశుడు సరయు నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన చేతి పట్టీని పోగొట్టుకున్నాడు. దానిని అతనితో ప్రేమలో పడ్డా ఓ నాగ-కన్య ఎత్తుకెళ్ళింది. ఆమె శివ భక్తురాలు కాబట్టి, కుశుడు ఆమె కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడు.

సూరజ్ కుండ్: ఇది పురాతన నీటి ట్యాంక్. దీనిని శ్రీరాముడు ఉపయోగించాడని నమ్ముతారు. ఈ చారిత్రక ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం అస్యాదించవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ లేజర్ షో కూడా ఉంటుంది. అయోధ్య వెళ్ళినవారు ఇది కచ్చితంగా చుడండి..

చోటి దేవకాళి ఆలయం: చోటి దేవకాళి ఆలయం పవిత్ర అభయారణ్యం లోపల మరెక్కడా లేని సాహసయాత్ర ప్రదేశం. పురాతన కాలం నాటి ఈ ఆలయం బలం మరియు భక్తి దేవత దేవకాళికి అంకితం చేయబడింది - ఇది పురాణాలు, ఇతిహాసాలు మరియు బహుశా మాయాజాలంతో నిండి ఉంది.